Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏడవాలన్నా, నవ్వాలన్నా.. అదే నటన : శ్రియ
తన సినిమాల్లో తనకు నచ్చిన పాటలగురించి చెప్తూ... దేవిశ్రీప్రసాద్ సంగీతం దర్శకత్వంలో వచ్చిన 'మలై' గీతాలు చాలా ఇష్టం. అందులోని 'నీ వరుంబోదు..' పాటంటే చెవికోసుకుంటా. ఇక ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చిన 'శివాజి'లోని 'ఆంబల్..' పాటను ఎన్నోసార్లు విన్నా అంది. : ప్రేమ, పెళ్లి గురించి చెప్తూ... ప్రకృతిలో ఎంతో గొప్ప విషయం ప్రేమ. అత్యంత వ్యక్తిగతం కూడా. ఎవరి ప్రేమ విషయంలోనూ జోక్యం చేసుకోకూడదనేది నా అభిప్రాయం. ఇక.. పెళ్లి గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తప్పకుండా అందరికీ చెప్పే చేసుకుంటా. వీలైనంత త్వరలోనే నా చేతివేలికి ఉంగరం చూడొచ్చు అని చెప్పుకొచ్చింది.
రజనీకాంత్తో నటించిన అనుభవం గురించి చెప్తూ... నిరాడంబర వ్యక్తి. ఆయనలా ఎవర్నీ చూడలేదు. అందరికన్నా భిన్నంగా ఆలోచిస్తారు. అందరి మంచి కోరుకుంటారు. సెట్లోనూ, బయట సింప్లిసిటీని కొనసాగిస్తారు. అంతేకాదు.. ఈగోలేని నటుడు. ఆశ్చర్యానికి కలిగించే గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ ఏడాది దీపావళి గురించి చెప్తూ... ముంబయిలోనే ఈ సారి పండుగ. కుటుంబికులు, స్నేహితులతో జరుపుకుంటా. నాకు నచ్చిన పండుగ ఇది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కొత్తదుస్తులు, మిత్రుల సందడి, రంగుల దీపాలు.. ఎంతో సంతోషంగా గడుపుతా అంది.
తెలుగులో ' ఇష్టం' చిత్రం ద్వారా ,తమిళ్ లో 'ఎనక్కు20 ఉనక్కు 18ఇష్టం' తో అడుగుపెట్టిన అందాలతార శ్రియ. ఆ తర్వాత వరస హిట్స్ తో దూసుకుపోయింది. తమిళంలో అయితే జయంరవితో 'వర్షం'లో తడిసి అక్కడి ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకుంది. రజనీకాంత్తో 'శివాజి', ధనుష్తో 'తిరువిళయాడల్', విజయ్తో 'అళగియ తమిళ్మగన్' చిత్రాలు చేసి మంచిపేరు సంపాదించింది. హిందీ చిత్ర పరిశ్రమపై అమ్మడు దృష్టిపెట్టడంతో కోలీవుడ్లో క్రేజీ క్రమంగా తగ్గుముఖం పట్టింది. తిరిగి ఆ స్థాయికి చేరుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తోంది. కానీ అవకాశాలు మాత్రం దక్కలేదు. తాజాగా తెలుగులో అక్కినేని త్రయం నటిస్తున్న 'మనం', హిందీలో 'వాల్మీకి..'లో నటిస్తోంది.