Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వందేళ్ళ దేవదాసుకి సినివారం నీరాజనం: ఈవారం సినివారం
బెంగాలీ రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన నవల దేవదాసుకు వందేళ్ళు నిండిన సంధర్భంగా సినివారం వేదిక పై దేవదాసు సినిమా ప్రదర్శణ.
దేవదాసు విఫలమో సఫలమో ఇదమిద్దంగా చెప్పలేని ఒక విషాద గాథ, ప్రపంచ ప్రసిద్ద ప్రేమ కథల్లో చోటు సంపాదించిన ఒక అత్యద్బుతమైన రచన. బెంగాలీ భాషలో ఉన్నా, ఇది తెలుగువారికథే అనిపించేలా సహజత్వానికి దగ్గరగా నవలలు రాసిన ప్రముఖుల్లో ఒకరు శరత్చంద్ర ఛటోపాధ్యాయ అనబడే 'శరత్బాబు'. దేవదాసు, పార్వతీ ఈ లోకం లోకి అడుగుపెట్టి ఆ అద్బుత కథ నిజంగా జరిగిందనే అనిపించేలా మనమధ్య ఇంకా జీవించబట్టీ 2 జూలై 2017 నాటికి 100 సంవత్సరాలయ్యింది... ఈ వందో పుట్టిన రోజునాడు ఆ ప్రేమికులకీ, రచనకీ, రచయితకీ ఒక్క కృతఙ్ఞత చెల్లించుకోవటం తప్ప మరేం చేయగలం..? దేవదాసు సినిమా గురించి చెబుతూ ఇలా అన్నారు మామిడి హరికృష్ణ.
మరణకాలాన లలాటం పై ఒక్క అరచేతి స్పర్శని కోరుకున్న దేవదాసూ, ప్రేమకీ, భాధ్యతకీ, కట్టుబాట్లకీ మధ్య తన అస్తిత్వాన్ని నిలుపుకున్న పార్వతికీ, ఈ ఇద్దరితోనూ ఏ సంబంధమూ లేకుందానే వారి ప్రేమలో తన అస్థిత్వాన్నే త్యాగం చేసిన చంద్రముఖికీ ఆఖరున వీళ్ళందరినీ మన గుండెల్లో నిలిపిన శరత్ చంద్రుడికీ మరేమివ్వగలరూ... మళ్ళీ ఒకసారి ఆ మహా ప్రేమగాథని మననం చేసుకోవటం, శరత్ చంద్రునికో నమస్కారం చేసుకోవటం తప్ప... సినీవారం వేదిక అదే చేసింది. ఆ ప్రేమకథని మళ్ళీ ఒకసారి కళ్ళముందు నిలుపుకుంది...
తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించే సినివారం కార్యక్రమంలో ఈ వారం (2జూలై 2017) న బెంగాలీ రచయిత శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన నవల దేవదాసుకు వందేళ్ళు నిండిన సంధర్భంగా, అదే రోజున తెలంగాణా సీనియర్ నటుడూ, రచయితా, దర్శకుడూ ఎం.ప్రభాకర రెడ్డి జయంతి సందర్భంగా. ఆ ఇద్దరు మహానుభావులకీ నివాళులు అర్పించిన అనంతరం మామిడి హరికృష్ణ. దేవదాసు నవలమీద, ఆ సినిమా మీదా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాషా సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ గారితో పాటు, అతిథిగా వచ్చిన రాజేంద్ర ప్రసాద్ యలవర్థి, సినివారం గ్రూప్ అక్షరా కుమార్, హుమాయూన్ సంఘీర్, ఎం ఎస్ విష్ణు, శివకట్టా, మహేష్ బాబు పాల్గొన్నారు...