మమ్మల్ని బాదొద్దు బాబోయ్(సినీ ప్రముఖుల ధర్నా)
వెంటనే సేవా పన్ను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో సేవా పన్ను బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన మా అధ్యక్షుడు మురళీ మోహన్ డిమాండ్ చేసారు. ఈ ఆందోలన కార్యక్రమంలో చిత్ర పరిశ్రమకు చెందినప 24 శాఖలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు డి. రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ, మురళీ మోహన్, నాగిరెడ్డి, అలీ, హీరో సునీల్, శివాజీ రాజా, దర్శకుడు తేజతో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ టాక్స్ పై దక్షిణాది సినీ పరిశ్రమలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని మురళీ మోహన్ వెల్లడించారు. మరో వైపు చెన్నైలో కూడా ఆందోళన కార్యక్రమం కొనసాగుతోంది.
సంవవత్సరంలో సగటున నిర్మించిన సినిమాలు, వాటికి పెట్టిన ఖర్చుతో పోలిస్తే... అసలు లాభాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉంది. ఈ తరుణంలో సర్వీస్ టాక్స్ విధిస్తే నిర్మాతలపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications












