Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాలీవుడ్ బాక్సాఫీస్: సంక్రాంతి రారాజు ఎవరో తేలి పోయింది!
హైదరాబాద్: ఈ సారి సంక్రాంతి బాక్సాఫీసు రేసులో నాలుగు సినిమాలు పోటా పోటీగా విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో', బాలయ్య నటించిన ‘డిక్టేటర్', నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయనా', శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా' విడుదలయ్యాయి. విడుదలైన ఈ నాలుగు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో అన్ని సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
అయితే ఈ సంక్రాంతి రేసులో రారాజుగా నిలిచేది బాలయ్య లేదా ఎన్టీఆర్ అని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఈ ఇద్దరినీ బీట్ చేసి నాగార్జున నటించిన ‘సోగ్గేడే చిన్నినాయనా' చిత్రం ముందు ఉంది. అటు ప్రేక్షకుల స్పందన పరంగా, విమర్శకుల రివ్యూల పరంగా టాప్ రేటింగ్ నాగార్జున సినిమాకే దక్కింది. దీంతో ఈ సంక్రాంతి రారాజు నాగార్జునే అంటున్నారంతా.
‘మనం' సినిమా తర్వాత నాగార్జున తన సొంత బేనర్లో ఆ స్థాయిలో హిట్ అందుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా ఎఫెక్టుతో ఆయన తర్వాతి సినిమా ‘ఊపిరి'పై అంచనాలు భారీగా పెరిగాయి.
వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ‘ఊపిరి' చిత్రంలో తమిళ స్టార్ కార్తి కూడా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుండే బయ్యర్లు పోటీ పడుతున్నారు. ఊపిరి చిత్రాన్ని మరో నెల రోజుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విదేశాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.