Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ ని చూసేందుకు వెళ్లి కరెంట్ షాక్..
నిజామాబాద్ :నిజామాబాద్లో బుధవారం జోయాలుక్కాస్ నగల షోరూమ్ను సినీ హీరో అల్లు అర్జున్ ప్రారంభించారు. బన్నీని చూడటానికి వందలాది మంది అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన హీరోని చూసేందుకు భారీగా జనం ఎగబడ్డారు. దాంతో షోరూం ప్రారంభించే సమయంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దాంతో 19 సంవత్సరాల జునేద్ విద్యుల్ షాక్ తగిలి అక్కడికక్కడే కూలిపోయారు. వెంటనే అతన్ని జిల్లా కేంద్ర గవర్నమెంట్ హాస్పటిల్ కి తీసుకు వెళ్లారు.
వివరాల్లోకి వెళితే... అల్లు అర్జున్ రాక నేపథ్యంలో బందోబస్తు నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. రోడ్డుపై విపరీతమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి నుంచి వచ్చిన అల్లు అర్జున్ అభిమాని ఎండీ కాసీఫ్ జునైద్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. తన అభిమాన హీరోను చూసేందుకు పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ కంచెపైకి ఎక్కిన కాసీఫ్ ప్రమాదానికి గురయ్యాడు.
మొదటిగా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకున్న అల్లు ఉదయం కొద్దిసేపు వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో ఫ్రెషప్ అయ్యారు. అనంతరం రోడ్డు కిరువైపులా కిక్కిరిసిన అభిమానులకు అభివాదం చేస్తూ షోరూంకు వెళ్లి ప్రారంభించారు. షోరూంలో జ్యోతి ప్రజ్వల న చేశారు. కొత్త మోడల్ ఆభరణాలను తిలకించారు. హైదరాబాద్రోడ్డులో ఇప్పటి కే బ్రాండెడ్ కంపెనీ వస్త్రాలయాలు, మూడు నక్షత్రాల హోటళ్లు, కళానికేతన్, ఆకృ తి, తదితర ప్రముఖ వ్యాపార షోరూంలు వెలిశాయి. జోయాలుక్కాస్ జ్యువె లర్ షోరూంతో ఈ రోడ్డును కొత్తశోభను సంతరించుకుంది.
అల్లు అర్జున్ మా ట్లాడుతూ ఇటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్కు ప్రాతినిథ్యం వహించటం ఎంతో సంతోషం గా ఉందన్నారు.2nzb30a నగల వ్యాపారంలో నమ్మకం, విశ్వాసంతో జోయాలుక్కాస్ ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్ ప్రజల విశ్వాసాన్ని చూరగొందన్నారు. జోయాలుక్కాస్లో ఉత్తమమైన ఆభరణాలను పొందవచ్చన్నారు. ప్రారంభోత్సవానికి ఇందూరుకు రావటం ఆనందంగా ఉందన్నారు.