నా భార్యను చూసి షాక్ తింటుంటా: త్రివిక్రమ్

పవన్కల్యాణ్తో హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అత్తారింటికి దారేది' వంద కోట్ల క్లబ్లో చేరనుందనేది ట్రేడ్ పండితుల విశ్లేషణ. దాంతో పవన్ లాంటి పవర్ ఫుల్ స్టార్ తో యాక్షన్ తగ్గించి కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రం చేయాలని త్రివిక్రమ్ కి ఎందుకు అనిపించింది అనేది అందరికీ ప్రశ్నే. ఆయన ముందే ఈ విజయం ఊహించి చేసారా...లేక తన మార్కుతో పవన్ ని చూపెట్టాలనే ఆలోచనే ఈ చిత్రం రూపొందేలా తయారుచేసిందా అనే ప్రశ్నలకు ఆయనే సమాధానం ఇచ్చారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ.. పవన్కల్యాణ్తో ఫ్యామిలీ స్టోరీని ప్లాన్ చేయాలనిని నేను కథ రాసుకునేటప్పుడు అవేమీ ఆలోచించలేదు. దర్శకుడిగా యాక్షన్ సినిమాలు చేశాను. కానీ పూర్తిస్థాయి కుటుంబకథా చిత్రం చేయలేదు. చేయాలనిపించింది. ఈ కథ చేశాను.ఈ సినిమా థాట్ ఎలా వచ్చిందంటే...'ఖలేజా' తర్వాత రాసుకున్న కథ ఇది. 'తీన్మార్' టైమ్లో పవన్గారికి చెప్పాను. ఆ తర్వాత ఆయన 'గబ్బర్సింగ్'తో బిజీ. నేను 'జులాయి' చేశాను. తర్వాత ఈ సినిమా చేశాం. ఇప్పుడంతా శుభం అన్నారు.
ఇక పవన్ తో తన భావజాలం కలవటం గురించి చెప్తూ... పనివేరు. వ్యక్తిగతం వేరు. కాకపోతే నాకు కల్యాణ్గారితోనూ, మహేష్గారితోనూ కంఫర్ట్ లెవల్స్ ఎక్కువ. వాళ్లు స్టార్స్ అనే విషయాన్ని మర్చిపోతారు. చాలా ఈజీగా తీసుకుంటారు. అందుకే వాళ్లతో పనిచేయడం చాలా ఈజీగా భావిస్తాను అన్నారు. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ను యువత బెంచ్ మార్కుల్లాగా భావిస్తున్నప్పుడు నిజంగా భయమేస్తుంది. ఆత్రేయ, జంధ్యాల, ముళ్లపూడి, మల్లాది వీళ్లందరూ ఎంతో గొప్పగా రాసిన సందర్భాలున్నాయి. వాళ్లందరినీ చూసిన నేను నన్ను పయనీర్ అని అనుకోను అన్నారు.


Click it and Unblock the Notifications











