Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
అమ్మాయిల్ని కించపరచాలని కాదు...వరుణ్ సందేశ్ వివరణ
అమ్మాయిల్ని కించపరిచే ఉద్దేశం మాకు లేదు. ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా చెప్పడం వల్లే ఈ సమస్య. అమీర్పేటలోని యువతరం భావాలు ఎలా ఉంటాయో చూపించాం. అక్కడి హాస్టళ్లలో అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారో చెప్పాం అంటూ చెప్పుకొచ్చారు వరుణ్ సందేశ్. క్రిందటి వారం విడుదలైన వరుణ్ తాజా చిత్రం 'ఏమైంది ఈ వేళ' చిత్రంలో అమీర్ పేట హాస్టల్స్ లో ఉండే అమ్మాయిల ప్రవర్తన బాగోలేదని, సెక్స్ కోసమే తపిస్తున్నట్లు చూపెట్టారని విమర్శలు వస్తున్న నేపధ్యంలో మీడియాను కలసిన వరుణ్ ఇలా స్పందించారు. అలాగే తమ చిత్రంపై వచ్చిన రివ్యూలు గురించి ప్రస్దావిస్తూ...
కొన్ని రివ్యూలు నిరుత్సాహపరిచినా..పాజిటివ్ రివ్యూలు ఉత్సాహాన్నిచ్చాయి. హాస్టల్స్ని నెగెటివ్ గా చూపించడం బహుశా కొందరికి నచ్చి ఉండకపోవచ్చు. అదీ యువత భవిత చెడిపోకూడదనే సందేశం ఇవ్వాలని చేసిన ప్రయత్నం మాత్రమే. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాన్ని అందులో చూపించాం అన్నారు. ఈ చిత్రం ద్వారా సంపత్నంది దర్సకుడుగానూ, నిషా అగర్వాల్(కాజల్ చెల్లెలు) హీరోయిన్ గానూ పరిచయం అయ్యారు.