Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
వెంకటేష్..చంద్రముఖి సీక్వెల్ తాజా సమాచారం
పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి సీక్వెల్(ఆప్త రక్షక రీమేక్)వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఈ చిత్రంలో అయిదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ భామలతో వెంకీకి ఉండే బంధం ఏమిటన్నది తెర మీదే చూడాలి అంటున్నారు దర్శక, నిర్మాతలు. అలాగే 'చంద్రముఖి'కి కొనసాగింపుగా వచ్చే ఈ కథలో వెంకీ పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉందనీ, ఆయన శైలి నటన, ఆహార్యం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో కీలకమైన సన్నివేశాల్ని ఏకబిగిన ఒకే షెడ్యూల్లో తెరకెక్కిస్తారు. మైసూర్, బెంగళూరు, బరోడాల్లో చిత్రీకరణ చేస్తారని సమాచారం. అనుష్క, కమలిని ముఖర్జీ, శ్రద్ధాదాస్, పూనమ్కౌర్, రిచా గంగోపాధ్యాయ ఈ చిత్రంలో హీరోయిన్స్.
చంద్రముఖి చిత్రం చూసిన వాళ్ళు 'లక లక లక లక' ని మర్చిపోవటం చాలా కష్టం. ఇప్పుడా 'లక లక లక లక' డైలాగుని 'లీడర్' చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ వల్లిస్తోంది. పి.వాసు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతోన్న చంద్రముఖి సీక్వెల్ లో ఆమె ఈ ఊతపదం వాడుతుంది. ఈ విషయాన్ని రిచానే కన్ఫర్మ్ చేసింది. అలాగే వెంకటేష్ ని దెయ్యంలా తరిమే పాత్రలో కమిలినీ ముఖర్జీ కనపడనుంది. కన్నడంలో సూపర్ హిట్టయిన ఆప్త రక్షక చిత్రం రీమేక్ లో ఆమె చనిపోయి దెయ్యంగా మారే అమ్మాయిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో అనుష్క మెయిన్ రోల్ చేస్తోంది. ఇక దెయ్యం వేషం గురించి కమిలిని మాట్లాడుతూ...కథలో కీలకమైన పాత్ర అది..అందుకే ఒప్పుకున్నాను.