Don't Miss!
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్న వెంకటేష్
హైదరాబాద్: సీనియర్ హీరో వెంకటేష్ తన వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇతర భాషల్లో తనకు సెట్టయ్యే సినిమాలు ఉంటే రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే హిందీలో హిట్టయిన ‘ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో ‘గోపాల గోపాల'గా, మళయాలం హిట్ మూవీని తెలుగులో దృశ్యంగా రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు.
తాజాగా వెంకటేష్ మరో సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మాధవన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘సాలాఖద్దూస్' చిత్రంపై ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ చిత్రంలో మాధవన్ రిటైర్డ్ బాక్సర్ గా నటిస్తున్నారు. తనకు ఉన్న అనుభవంతో మంచి బాక్సార్ ను తయారు చేసే క్యారెక్టర్లో ఆయన కనిపిస్తారు.
ఈ చిత్రం విడుదలై హిట్టయితే...వెంకటేష్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సినిమా విడుదల తర్వాత వెంకటేష్ ఈ సినిమా చేయాలా? వద్దా అనే దానిపై ఓ నిర్ణయానికి రాబోతున్నాడు.
సాలా ఖద్దూస్ తెలుగు వెర్షన్ త్వరలో రాబోతోందని దర్శకుడు సుధా కొంగర ప్రసాద్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే హీరోగా ఎవరు చేస్తున్నారనే విషయం మాత్రం ఆయన ఇంకా ప్రకటించలేదు. వెంకటేష్ నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే అఫీషియల్ ప్రకటన రానుంది.
దృశ్యం' తర్వత మరే సినిమా చెయ్యలేదు. ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో 'బాబు బంగారం' (వర్కంగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా, స్పీడ్ గా సాగిపోతోంది. అదే విధంగా బిజినెస్ సైతం చాలా ఊపుగా , స్పీడుగా ,సైలెంట్ గా జరుగుపోతోందని సమాచారం.
నయనతార లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా మంచి హిట్ అవుతుందని, గతంలో వెంకటేష్, నయనతారా కాంబినేషన్ లో వచ్చిన లక్ష్మి, తులసి సినిమాలు సూపరు హిట్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మంచి హిట్స్ తో ముందుకు దూసుకుపోతున్న డైరక్టర్ మారుతి ఈ ఫ్యామిలి సినిమాతో ఏ రేంజిలో మాయా చెస్తాడో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. . ఎస్. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.