Just In
- 37 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 43 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 1 hr ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 1 hr ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
Don't Miss!
- News
దారుణం.. దళిత యువకులను చెట్టుకు కట్టేసి కొట్టారు... షాకింగ్ వీడియో..
- Finance
ఫ్యూచర్ గ్రూప్ డీల్, అమెజాన్కు షాక్: రిలయన్స్కు గుడ్న్యూస్, షేర్ జంప్
- Sports
IPL 2021లో అత్యధిక ధర అతనికే.. ఎవరూ ఊహించరు కూడా!!
- Automobiles
భారత్లో అడుగుపెట్టిన కొత్త బిఎమ్డబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్; ధర & వివరాలు
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిజం: 'బాహుబలి' రైటర్ టీవి సీరిస్ రాస్తున్నారు,డిటేల్స్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, 'బాహుబలి', బజరంగి భాయీజాన్ వంటి మెగా హిట్స్ రచయిత విజియేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఓ టీవి సీరియల్ రచనలో నిమగ్నమయ్యారని సమాచారం. బాలీవుడ్ దర్శకుడు గోల్డెన్ భెల్ దర్శకత్వంలో ఈ టీవి షో తెరకెక్కనుంది. రజనీదుగ్గల్, రాధ కూతురు కార్తిక ఈ టీవి షోలో ప్రధానపాత్రలు పోషించనున్నట్లు సమాచారం.
ఒకవైపు బాహుబలి రెండవ పార్ట్ కథకు నగిషీలు చెక్కుతూ మిగతా సినిమా కథలు రాస్తూ, ఓ ప్రక్క వల్లి అనే సినిమా దర్శకత్వంనే మరోవైపు బుల్లితెరపై కూడా తన స్టోరీ ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే రెండు సినిమాలు స్క్రిప్టులు రాస్తున్న విజయేంద్ర ప్రసాద్.. ఈ హిందీ సీరియల్కు స్క్రిప్ట్ రాయటంతో బాలీవుడ్ లో స్టార్ రైటర్ గా మారుమ్రోగుతారని అంచనాలు వేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే..ఒకే ఒక్కడు' హిందీ వెర్షన్ 'నాయక్'కు సీక్వెల్ రాబోతోందట. దానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్తో కలిసి దీపక్ ముకుత్ అనే నిర్మాత 'నాయక్'కు సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఈ సీక్వెల్ కు కథ కూడా సిద్ధం చేశాడట. హీరో హీరోయిన్లు.. దర్శకుడు ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తారని చెప్తున్నారు. మరికొద్ది రైటర్లతో విజయేంద్ర ప్రసాద్ అందించిన కథను పూర్తి స్థాయి స్క్రిప్టుగా మలుస్తున్నట్లు చెబుతున్నారు. 'నాయక్'లో అనిల్ కపూర్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు అప్పట్లో మంచి హైపే వచ్చింది కానీ.. బాక్సాఫీస్ ఏవరేజ్ మూవీగా మిగిలిపోయింది.