Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాగార్జున అడిగింది ఒకటి..విక్రమ్ కుమార్ చేస్తున్నది మరొకటి !
ఇష్క్, 24, మనం వంటి చిత్రాలతో తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు దర్శకుడు విక్రమ్ కుమార్. ఇటీవల విక్రమ్ కుమార్ అఖిల్ తో హలో చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో విక్రమ్ కుమార్ తదుపరి ఎలాంటి చిత్రం చేయాలనే డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యన నాగార్జున తన తనయుడు నాగ చైతన్యతో ఓ చిత్రాన్ని చేయాలని కోరినట్లు ప్రచారం జరిగింది. కానీ విక్రమ్ కుమార్ ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
విక్రమ్ కుమార్ ఇది వరకే 13బి అనే బాలీవుడ్ చిత్రాన్ని మాధవన్ తో తెరకెక్కించి ఉన్నారు. కాగా విక్రమ్ కుమార్ ఇప్పుడు అక్షయ్ కుమార్ తో సినిమా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. తనకోసం మంచి కథ సిద్ధం చేయమని అక్షయ్ కుమార్ విక్రమ్ కుమార్ ని కోరాడట. తాజాగా విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ తో అక్షయ్ వద్దకు వెళ్లాడని, కథ నచ్చడంతో అక్షయ్ పచ్చజెండా ఊపినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జూన్ నుంచి ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. నాగచైతన్య తో సినిమా చేయాలని నాగార్జున కోరినా ప్రస్తుతం నాగచైతన్య బిజీగా ఉన్నాడు. దీనితో విక్రమ్ కుమార్ అక్షయ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.