Don't Miss!
- News నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ. ఎన్టీఆర్తో మాట్లాడాను... చేస్తానన్నాడు: రామానాయుడు
అప్పట్లో అది నలుపు-తెలుపు సినిమా. ఒకవేళ ఇప్పుడు రీమేక్ చేస్తే చక్కగా కలర్లో తీయొచ్చు. కుదరకపోతే.. కనీసం రంగుల్లో అయినా చూసుకుందామని కలర్కి మార్చాలనుకుంటున్నాను అని చెప్పారు. ఈరోజు రామానాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ ఈ విషయం తెలిపారు.
అలాగే రానా తమ్ముడు అభిరామ్ని హీరో గా లాంచ్ చేసే విషయమై మాట్లాడుతూ ... నాకైతే చెయ్యాలనే ఉంది. కానీ సురేష్బాబుకి ఇప్పుడే ఇష్టం లేదు. అయితే అభిరామ్ మాత్రం ఎప్పుడెప్పుడు హీరో అవుదామా అని ఎదురు చూస్తున్నాడు . ప్రస్తుతం నేను నిర్మించే సినిమాల నిర్మాణంలో ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇదిగో ఇప్పుడు సునిల్కుమార్రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న 'నేనేం చిన్నపిల్లనా?' చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుగుతుంటే వెళ్లాడు. ఈ నెల 14తో అక్కడి షెడ్యూల్ పూర్తవుతుంది అని చెప్పారు.
దర్శకత్వం చేయాలనే కోరిక గురించి చెప్తూ... ఆ కోరిక ఒక్కటే మిగిలి ఉంది. అది నెరవేర్చుకుంటాను. దాంతో పాటు ఇంకో కోరిక కూడా ఉంది. వెంకటేష్, మా పెద్ద మనవడు, చిన్న మనవళ్ల కాంబినేషన్లో ఓ సినిమా నిర్మించాలనే ఆలోచన ఉంది. ఈ చిత్రాన్ని సురేష్బాబు నిర్మిస్తాడు. దీనికోసం కథ రెడీ చేయిస్తున్నాను. ఇటీవలే ఒక రచయిత కలిశాడు. కథ వినబోతున్నాను. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో చెబుతా అని చెప్పుకొచ్చారు.