Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'రోబో' రిలీజ్ కోసం రామ్ చరణ్ సినిమాని...అల్లు శిరీష్
రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర తమిళంలోకి మన్నాది మన్నాన్ డబ్బింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ కొంత టైమ్ కావాలంటున్నాడు అల్లు శిరీష్. ఆయన ట్విట్టర్ లో ఈ విషయం ప్రస్దావిస్తూ...మన్నాది మన్నన్(మగధీర తమిళ్) రెడీ. కానీ మేం రోబో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ తర్వాత మేం తమిళనాడులో ఎటాక్ చేస్తాం. అలాగే నేను తమిళంలో ఓ చిత్రం నిర్మిస్తాను. అయితే వెంటనే కాదు. భవిష్యత్ లో అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాను. కొంత టైమ్ పడుతుంది అని వ్యాఖ్యానించారు.
ఇక తన చిత్రాలకు మాత్రమే మాటలు రాసుకునే నటుడు, రచయిత, దర్శకుడు కె. భాగ్యరాజా తొలిసారి 'మన్నాది మన్నన్" కు మాటలు రాస్తున్నారు. అలాగే సీనియర్ గేయ రచయిత వాలి పాటలు రాస్తున్నారు. ఈ చిత్ర తమిళ హక్కులను కలైపులి యస్. ధాను సొంతం చేసుకున్నారు. సునీల్ కామెడీ ట్రాక్ ను వడివేలుతో రీషూట్ చేసారు..60వ దశకంలో యం.జి.ఆర్ నటించిన 'మన్నాది మన్నన్" టైటిల్ తో తెలుగు మగధీర తమిళంలోకి జూన్ లో అడుగుపెడుతున్నాడు. రామ్ చరణ్ తమిళంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పడం విశేషం.