Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మనోజ్ పెళ్లికి నాగార్జున ఎందుకు రాలేదు?
హైదరాబాద్: మంచు మనోజ్ పెళ్లి వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా దాదాపుగా హాజరయ్యారు. అయితే నాగార్జున-అమల దంపతులు మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు. పెళ్లి ముందు మంచు వారి ఇంట్లో జరిగిన నలుగు పెట్టే వేడుక, పెళ్లి కొడుకును చేసే వేడుక, సంగీత్ వేడుకల్లోనూ నాగార్జున కనిపించలేదు.
నాగార్జున దంపతులు ఈ వేడుకకు హాజరు కాక పోవడానికి గల కారణం ఏమిటో తెలిసి పోయింది. ప్రస్తుతం వారు అసలు ఇండియాలోనే లేరు. స్పెయిన్ వెళ్లారు. నాగార్జున తనయుడు అఖిల్ నటిస్తున్న మొదటి సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ కొన్ని రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు.
ముద్దుల కొడుకు నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ జంట చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. హైదరాబాద్ లో జరిగిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ స్వయంగా వీక్షించిన వీరు.....రొమాంటిక్ సాంగుల విషయంలో కొడుకు పెర్ఫార్మెన్స్ స్వయంగా చూడటానికే అక్కడికి వెళ్లారట.
అఖిల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి ‘మిస్సైల్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్, అనూప్ రూబెన్స్ జాయింటుగా సంగీతం అందిస్తున్నారు. సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.