Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆది సినిమాతో దర్శకుడిగా మారుతున్న డైమండ్ రత్నబాబు
దాసరి నారాయణరావు, జంధ్యాల, త్రివిక్రమ్, కొరటాల శివ, అనిల్ రావిపూడి తదితరులు రచయితగా కెరీర్ మొదలు పెట్టి దర్శకులుగా మారిన సంగతి తెలిసిందే. ఇపుడు వీరి దారిలోనే మరో రచయిత దర్శకత్వంలోకి అడుగు పెడుతున్నారు. అతడు మరెవరో కాదు... డైమండ్ రత్న బాబు.
హీరో రామ్ నటించిన "దేవదాసు" చిత్రానికి ఘోస్ట్ రైటర్ గా వర్క్ చేసి సీమశాస్త్రి, పిల్లా నువ్వు లేని జీవితం, పాండవులు పాండవులు తుమ్మెద, సెల్ఫీ రాజా, ఈడోరకం ఆడోరకం, లేటెస్ట్ గా మోహన్ బాబు గాయత్రి సినిమాకు రచయితగా పనిచేసి తనదైన మార్క్ సంపాదించుకున్నాడు.
రచయితగా కెరీర్ కొనసాగిస్తున్న డైమాండ్ రత్నబాబు దర్శకుడిగా మారి ఆది సాయికుమార్ కు కథ చెప్పడం సింగల్ సిట్టింగ్ లో ఓకే అవ్వడం జరిగింది. కథ డిఫరెంట్ జానర్ లో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. దీపాల ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.