Bigg Boss Non Stop: బాత్రూంలో చూశా నీవి తగ్గిపోయాయి.. బిందుపై అఖిల్ కామెంట్స్‌.. బయటపెట్టిన నాగ్

తెలుగు బుల్లితెరపై ఎన్నో జోనర్లకు సంబంధించిన షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే భారీ స్థాయిలో స్పందనను దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన షో బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో ప్రసారమయ్యే షోనే అయినా దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.

ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్‌ మొదటి సీజన్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇది కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అఖిల్, బిందు మధ్య బాత్రూం గురించి జరిగిన గొడవను హోస్ట్ నాగార్జున లేవనెత్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి!

ఆ సీజన్‌లను మరిపించేలా

ఆ సీజన్‌లను మరిపించేలా

తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే ఐదు సీజన్లను ఒక దానికి మించి ఒకటి భారీ రెస్పాన్స్‌తో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు వాటిని మించేలా ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌ను చూపించడంతో పాటు బోల్డు సీన్స్‌ను హైలైట్ చేస్తున్నారు. దీంతో ఇందులో పాత సీజన్లను మించిన వినోదం అందుతోంది.

7 వారాల్లో వాళ్లు ఎలిమినేట్

7 వారాల్లో వాళ్లు ఎలిమినేట్

ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి మొత్తం 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన ఏడు వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టాలు బయటకు వెళ్లిపోయారు.

8వ వారం గొడవలతో రచ్చ

8వ వారం గొడవలతో రచ్చ

8వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ పోటీదారుల కోసం 'హ్యూమన్స్ వర్సెస్ ఏలియన్స్' టాస్కును ఇచ్చారు. ఇందులో గెలిచిన జట్టు సభ్యులే ఈ వారం కెప్టెన్సీకి పోటీ చేసే అర్హతను పొందుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో హ్యూమన్స్ టీమ్ గెలిచింది. దీంతో వాళ్లంతా కెప్టెన్సీ టాస్కుకు పోటీ పడగా.. అందులో అఖిల్ సార్థక్ మరోసారి కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.

కంటెస్టెంట్లపై నాగ్ ఆగ్రహం

కంటెస్టెంట్లపై నాగ్ ఆగ్రహం

రెగ్యూలర్ బిగ్ బాస్ షోలో హోస్ట్ అక్కినేని నాగార్జున వారానికి రెండు రోజుల పాటు సందడి చేసేవాడు. నాన్ స్టాప్ సీజన్‌లో మాత్రం ఆదివారం మాత్రమే కనిపిస్తాడని ముందే వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత ఆదివారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ఆయన ఆరంభం నుంచే కొన్ని గొడవలను హైలైట్ చేసేలా పంచాయతీలు పెట్టాడు. ఆ తర్వాత వాళ్లతో గేమ్స్ కూడా ఆడించాడు.

బిందు మాధవితో మొదలు

బిందు మాధవితో మొదలు

ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున ముందుగా యాంకర్ శివను కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచాడు. అందులో బిందు మాధవి గురించి అఖిల్ అన్న విషయాన్ని ప్రస్తావించాడు. అప్పుడు అతడు అఖిల్ అన్నది డబుల్ మీనింగ్‌లో అర్థం వచ్చేలా ఉందని చెప్పాడు. ఇది ఎంతకూ తెగకపోవడంతో బిందు, అఖిల్‌ను కూడా పిలిచాడు. వాళ్లు వాళ్ల వెర్షన్స్ చెప్పుకున్నారు.

బాత్రూంలో చూశానంటూ

బాత్రూంలో చూశానంటూ

నామినేషన్స్ టాస్క్ సమయంలో బిందు మాధవి 'నీ బాడీలో చాలా మార్పులు వస్తున్నాయి' అని అఖిల్‌తో అంది. దీనికి అతడు 'నీకు కూడా మార్పులు వస్తున్నాయి. నేనూ బాత్రూంలో చూశా' అని అన్నాడు. దీంతో అప్పుడు బిందు దీన్ని లైట్ తీసుకుంది. కానీ, ఇప్పుడు నాగ్ ఈ పంచాయతీ పెట్టడంతో ఈ మేటర్ మళ్లీ వెలుగులోకి వచ్చి.. పెద్ద చర్చకు దారి తీసేసింది.

అఖిల్ మొదలు పెట్టాడని

అఖిల్ మొదలు పెట్టాడని

అసలు బాత్రూం అనే మాటను ఎందుకు అన్నావని నాగార్జున ప్రశ్నించగా.. 'నేను ఏ ఉద్దేశంతో అనలేదు. అసలు ఆ మాట ఎందుకు వచ్చిందో తెలీదు' అని బదులిచ్చాడు. కానీ, అతడు మాత్రం ఏదో ఉద్దేశంతోనే అన్నట్లు అనిపించింది. ఇక, చేసేదేం లేక నాగార్జున మళ్లీ అలాంటి మాటలు అనొద్దని అఖిల్‌ను హెచ్చరించాడు. దీంతో ఈ గొడవకు పుల్‌స్టాప్ పడిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X