Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నటుడిగా ‘ప్రాణం’ పోసుకున్న రోజు.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్థావించకుండా తెలుగు సినిమా చరిత్రను రాయలేం.. చెప్పలేం. అప్పటి వరకు ఉన్న ట్రెండ్ను ఒక్కసారిగా మార్చేశాడు. యాక్షన్, డైలాగ్స్, డ్యాన్సులు, స్టైల్ ఇలా ప్రతీ ఒక్క విషయంతో తెలుగు సినిమా గతిని మార్చేశాడు. డైనమిక్ హీరో, సుప్రీం హీరో అంటూ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ స్థాయికి చేరుకున్నాడు. చిరంజీవి నటుడిగా ప్రస్థానం మొదలై నేటికి 42 ఏళ్లు అవుతోంది. నేడు (సెప్టెంబర్ 22) చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలైన రోజు.
ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యత వుందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యత వుంది.. ఆగస్టు 22న నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజైతే.. సెప్టెంబర్ 22న నటుడిగా 'ప్రాణం' (ఖరీదు) పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను యింతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అని పోస్ట్ చేశాడు.
ఇక సోషల్ మీడియాలో ఈ మేరకు విషెస్ వెల్లువెత్తున్నాయి. నటుడిగా 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నందుకు సినీ ప్రముఖులు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. ఈ మేరకు మెహర్ రమేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నిరంతరం కష్టపడే తత్త్వం, అంకిత భావం, ఇన్స్పిరేషన్, హృదయాలను కొల్లగొట్టిన విజేత.. వెండితెర రారాజు అంటూ మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికిత్తేశాడు. ఇక మెహర్ రమేష్ తదుపరి ప్రాజెక్ట్ చిరంజీవితో ఫిక్స్ అయిందన్న సంగతి తెలిసిందే.