Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సరిలేరు నీకెవ్వరు గ్రాండ్ పార్టీ.. మహేష్తో ఎంజాయ్ చేసిన రష్మిక అండ్ టీం
సూపర్ స్టార్ మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు టీం అంతా కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. నిన్న (ఆదివారం) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ పూర్తయిన తర్వాత ఎంటైర్ యూనిట్కు సూపర్స్టార్ మహేష్ బాబు గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహేష్ బాబు అరేంజ్ చేసిన ఈ పార్టీలో మహేష్ బాబు సహా రష్మిక మందన్న, విజయశాంతి, అనిల్ రావిపూడి, తమన్నా, రామ జోగయ్య శాస్త్రి, దేవీ శ్రీ ప్రసాద్, వంశీ పైడిపెల్లి, నమ్రత శిరోద్కర్, సంగీత తదితరులు పాల్గొని ఎంజాయ్ చేసినట్లు సమాచారం. ఇలా చిత్రయూనిట్ అంతా ఒక్కచోట చేరి ఫోటోలకు పోజులివ్వడం మహేష్ అభిమానులను కనువిందు చేస్తోంది.
దిల్రాజు బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని నిర్మించారు.
ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.