Don't Miss!
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జీవితంలో సావిత్రి చేసిన అతిపెద్ద తప్పు అదే.. తమిళ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు
Recommended Video
దక్షిణాది ప్రేక్షకుల అభిమాన నటి సావిత్రి జీవిత ఆధారంగా మహానటి (తమిళంలో నడిగైయార్ తిలకం) చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. సావిత్రి జీవితం దుర్భుర స్థితిలోకి చేరుకోవడంపై అనేక కథనాలు ప్రచురితమవుతున్నాయి. అనేక కోణాల్లో మహానటి జీవితాన్ని ఆవిష్కరిస్తున్నారు. తాజాగా సావిత్రి భర్త జెమినీ గణేషన్కు అతి సన్నిహితుడు, నటుడు రాజేష్ ఇటీవల తమిళ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
జెమినీ గణేషన్తో వివాహం
తమిళ నటుడు జెమినీ గణేషన్ను సావిత్రి పెళ్లి చేసుకోవడం ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అని రాజేష్ అన్నారు. జెమినీ గణేషన్కు ఇదివరకే వివాహం జరిగిందనే విషయం ఆమెకు తెలుసు. అయినా ప్రేమలో పడటం దారుణం. అలాంటి వ్యక్తితో ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అని రాజేష్ అభిప్రాయపడ్డారు.
సావిత్రి జీవితం దుర్భరంగా
జెమినీ గణేషన్ను పెళ్లి చేసుకోవడమనేది జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు. అదే ఆమె జీవితం దుర్భర స్థితిలోకి నెట్టడానికి కారణమైంది. జెమినీ గణేషన్ ప్రవర్తన, జీవితం చాలా సావిత్రికి సరిపడనిది అని రాజేష్ పేర్కొన్నారు.
తాగుడు వ్యసనంతో సావిత్రి
సావిత్రి తాగుడుకు బానిస కావడం ఆమె స్వయంకృపారాధం. ప్రముఖులెవరైనా మద్యం ఆఫర్ చేస్తే నేను తీసుకొంటాను. కానీ దానికి బానిస కాలేను. అదే విధంగా సావిత్రికి జెమినీ గణేషన్ మద్యం అలవాటు చేశాడు. ఆమె దానిని వ్యసనంగా మార్చుకొన్నారు. అదే ఆమె చేసిన పెద్ద తప్పు అని రాజేష్ వివరించారు.
మహానటికి విశేష ఆదరణ
తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన మహానటి చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభించింది. రెండు భాషల్లోనూ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. కానీ కొన్ని సన్నివేశాలు, పాత్రల చిత్రీకరణ వాస్తవానికి దూరంగా ఉందనే వాదన వ్యక్తమవుతున్నది. వైజయంతీ మూవీస్, స్వప్న బ్యానర్పై రూపొందిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహించారు.