తమిళ రాజకీయాల్లోకి విశాల్: అక్కడ ఫలితాన్ని శాసించేది తెలుగువారే
తమిళనాట అధికార, విపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగువాడైన యువ నటుడు విశాల్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Recommended Video

తమిళనాడు రాష్ట్రంలోని ఆర్కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో సినీ నటుడు విశాల్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఆర్కె నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఎన్నికల నోటిఫికేషన్
గతంలోనే ఈ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయితే ఆ సమయంలో విచ్చలవిడిగా డబ్బులను ఖర్చు చేశారని ఆరోపణలు రావడంతో ఎన్నికలను వాయిదా వేశారు.ప్రస్తుతం ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.

నటుడు విశాల్
తమిళనాట అధికార, విపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగువాడైన యువ నటుడు విశాల్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఫలితాన్ని శాసించేది తెలుగువారే. దీంతో ఇక్కడి నుంచి విశాల్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

అన్నాడీఎంకే తరఫున
ఇక్కడ అన్నాడీఎంకే తరఫున తెలుగువాడైన ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ ఈ మధుసూదన్, డీఎంకే తరఫున మరుదుగణేశ్, స్వతంత్య్ర అభ్యర్థిగా అన్నాడీఎంకే అసమ్మతినేత టీటీవీ దినకరన్ శుక్రవారం నామినేషన్లు వేశారు. అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకమైనందున డీఎంకే అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలున్నాయి.

అధికారికంగా
అయితే ఈ విషయమై ఇంకా అధికారికంగా విశాల్ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేదా అనే విషయాలపై విశాల్ ఏ రకంగా స్పందిస్తారోననేది ఆసక్తిగా మారింది. అందుకే విశాల్ను రంగంలోకి దింపాలని దినకరన్ గట్టిగా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. విశాల్ సన్నిహితులు మాత్రం ఈ వార్తలను ఖండించారు.


Click it and Unblock the Notifications











