Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కేక పుట్టించిన కలెక్షన్స్: రెండు రోజుల్లో 20 కోట్లు
హైదరాబాద్: తమిళ హీరో అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్' చిత్రం సూపర్ హిట్ టాకుతో దూసుకెలుతోంది. అంతే కాకుండా ఈ చిత్రం రెండు రోజుల్లోనే రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో ఏకంగా రూ. 20.83 కోట్లు వసూలు చేసి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరిచింది.
ప్రముఖ
ట్రేడ్
అనాలసిస్ట్
త్రినాథ్
ఈ
సినిమా
కలెక్షన్లపై
స్పందిస్తూ..‘ఎన్నై
అరిందాల్
కలెక్షన్లు
ఆశ్చర్య
పరిచే
విధంగా
ఉన్నాయి.
తొలి
రోజు
రూ.
11.5
కోట్లు
వసూలు
చేసిన
ఈ
చిత్రం
రెండు
రోజుల్లో
రూ.
20.83
కోట్లు
వసూలు
చేసింది.
గురువారం
రిలీజ్
అయినా
ఈ
రేంజిలో
రెస్పాన్స్
రావడం
ఆశ్చర్యకరం'
అన్నారు.
ఫేస్బుక్
ద్వారా
లేటెస్ట్
అప్డేట్స్
ఎప్పటికప్పుడు
‘ఎన్నై అరిందాల్' సినిమా విషయానిస్తే..గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అనుష్క, త్రిష హీరోయిన్లు. సంక్రాంతికే రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి ఇపుడు రిలీజైంది. ‘ఐ' సినిమాతో పోటీ పడటం ఇష్టం లేకనే సినిమాను వాయిదా వేసారి అప్పట్లో టాక్. కానీ ఈ సినిమా అపుడు విడుదలయి ఉంటే ‘ఐ' సినిమాకు భారీ నష్టం జరిగి ఉండేదని సినిమా చూసిన వారు అంటున్నారు. ఆ రేంజిలో ఉంది మరి ఈ సినిమా టాక్.
విడుదలైన తర్వాత ఈ చిత్రం భారీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. గతంలో అజిత్ నటించిన సినిమాలు వరుసగా విజయాలు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
ఇక ఈ చిత్రాన్ని తెలుగులో "ఎంతవాడు కానీ.." అనే పేరుతో డబ్ అయి విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ కి యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పడే సినిమా హిట్ అవుతుందని అంచనాలు వేసారు. అంతా అనుకున్నట్లే జరిగింది. అజిత్ మూడు వైవిధ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో అనుష్క, త్రిషలు తమ అందచందాలతో ఆకట్టుకున్నారు.
ఆర్టిఫిషియల్ లుక్తో కనిపించకూడదనే ఉద్దేశంతో అజిత్ కుమార్ ఈ సినిమాలోనూ తెల్లజుట్టుతోనే కనిపించారు. ఇది పోలీస్ యాక్షన్ ఎంటర్టెనర్. అదే సమయంలో గౌతం మీనన్ చిత్రాల నుండి ఆశించే రొమాంటిక్ సీన్లు కూడా మెండుగానే ఉన్నాయట. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సీన్లు మంచి కిక్ ఇస్తాయని అంటున్నారు త్వలోనే తెలుగు రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.