Don't Miss!
- News నెల్లూరు జైలుకు జగన్ పై దాడి కేసు నిందితుడు సతీష్-14 రోజుల రిమాండ్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమల నోట్లో దుమ్ముకొట్టిన శృతి హాసన్
ఇప్పుడిప్పుడే ఎదుగుతూ అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అమలా పౌల్ నోట్లో దుమ్ము కొట్టిన పరిస్ధితి తీసుకు వచ్చింది శృతి హాసన్. శృతి హాసన్ మనసు మార్చుకోవడంతో అమలాపాల్ చేతిలోని సినిమా చేజారింది. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య 'త్రీ' అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తొలుత శ్రుతిని నాయికగా ఎంచుకొంటే కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోయింది. అప్పుడు అమలాపాల్ని తీసుకొన్నారు. ఇప్పుడు శ్రుతి నటిస్తానని చెప్పడంతో అమలాని తప్పించారు. నాన్న చిత్రంతో పరిచయమైన అమలా పౌల్ ఈ ధనుష్ సరసన ఛాన్స్ అనగానే మురిసిపోయింది.
ఈ త్రీ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది.ఈ చిత్రం హిట్టైతే తన కెరీర్ గాడిన పడుతుందని ఆశించింది. అయితే అనుకోని విధంగా శ్రుతి సీన్ లోకి రావటంతో ఆమె పాపం నీరసపడిపోయింది. ఇక నాగచైతన్య సరసన సైతం అమలా పౌల్ ని తీసుకున్నారు. రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న బెజవాడ రౌడీలు చిత్రంలో ఆమెను ఓ హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఇదిలా ఉంటే మరో ప్రక్క ఆమె పై బ్యాన్ పెట్టాలని మళయాళి పరిశ్రమ ప్లాన్ చేస్తోంది. మళయాళం నుంచి వెళ్ళి అక్కడ సినిమాలను చిన్న చూపు చూస్తోందని,మళయాళ పరిశ్రమ కత్తిగట్టింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం పోవటం ఆమెను బాధపెట్టే అంశమే.