Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బన్ని ఇచ్చిన ట్విస్ట్ కు దిమ్మ తిగిగిపోయింది
హైదరాబాద్: ఏ నిముషానికి ఏమి జరుగునో అనే పాట సినీ పరిశ్రమకు ఖచ్చితంగా వర్తిస్తుంది. ఓకే అనుకున్న ప్రాజెక్టులు...వెనక్కి వెళ్లటం..ఉండదు అనుకున్న సినిమా పట్టాలు ఎక్కేయటం రాత్రికి రాత్రే జరిగిపోతూంటాయి. ఇప్పుడు అలాంటిదే అల్లు అర్జున్ తదుపరి చిత్రానికి కూడా జరిగిందని తమిళ సినీ వర్గాల సమాచారం.
అల్లు అర్జున్ కోసం తమిళ దర్శకుడు లింగు సామి..పందెం కోడి సీక్వెల్ ని వదిలేసుకుని మరీ స్రిప్టుతో రెడీ అయ్యారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం లింగు సామి ని ప్రక్కన పెట్టి మరో తమిళ దర్శకుడు తెలుగులో మనం, ఇష్క్ చిత్రాలు అందించిన విక్రమ్ కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బన్నీ డేట్స్ ఇచ్చాడని ఆపేసాడు...విశాల్ కు కాలి,కంప్లైంట్
ఈ మేరకు విక్రమ్ కుమార్ ..ఓ స్టోరీ లైన్ ని అల్లు అర్జున్ కు చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ఆ స్టోరీ లైన్ విన్న అల్లు అర్జున్ వేరే ఆలోచన లేకుండా తన తదుపరి చిత్రం డేట్స్ కేటాయిస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.
దాంతో విక్రమ్ కుమార్ తన టీమ్ తో ఆ స్టోరీ లైన్ ని డవలప్ చేసుకునే పనిలో పడగా..అల్లు అర్జున్ మీద ఆశలు పెట్టుకున్న లింగు సామి మాత్రం అటు విశాల్ తో తగువు పెట్టుకుని, అక్కడ ఫిల్మ్ ఛాంబర్ లో సైతం కేసు వేయించుకుని , ఈ కొత్త ట్విస్ట్ కు షాక్ అయ్యి చూస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
అల్లు అర్జున్ మాత్రం చక్కగా తన సరైనోడు చిత్రం పై పూర్తి దృష్టి పెట్టారు. ఈ చిత్రం విడుదల అవగానే విక్రమ్ కుమార్ సినిమాకు సంభందించిన పనులు మొదలవుతాయి. విక్రమ్ కుమార్ ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో 24 అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్ మార్చి 3న విడుదల కానుంది. అదీ మ్యాటర్.