Don't Miss!
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఇంకో హిందీ సినిమా ఓకే చేసేసాడు
ఇక నుంచీ హిందీలో ఒకటి, తమిళంలో ఒకటి చిత్రం చొప్పున కెరీర్ను కొనసాగిస్తానని ప్రకటించిన ధనుష్ ఆ మాట నిలబెట్టుకున్నాడు. ధనుష్ తొలిసారిగా నటిస్తున్న హిందీ సినిమా 'రాంజానా'. క్రిష్కలుల్లా నిర్మిస్తున్నాడు. ఆనంద్ ఎల్రాయ్ (తను వెడ్స్ మను దర్సకుడు) తెరకెక్కిస్తున్నాడు. సోనమ్ కపూర్ హీరోయిన్. షూటింగ్ పూర్తయింది. ఈ నేపధ్యంలో ఆయన మరో బాలీవుడ్ చిత్రం కమిటయ్యాడు.
ధనుష్ మాట్లాడుతూ.. తనకు భాష ముఖ్యం కాదని, కథ నచ్చితే చాలని తెలిపాడు. బాలీవుడ్లో క్రమం తప్పక నటిస్తానని అక్కడొకటి, ఇక్కడొకటి చొప్పున కెరీర్ కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఆ మేరకు ప్రస్తుతం మరో హిందీ కథకు పచ్చజెండా ఊపాడు.
ఈ కొత్త చిత్రం కూడా 'రాంజానా' దర్శకుడు ఆనంద్ ఎల్రాయ్ నిర్దేశకత్వంలోనే రూపొందనుండటం విశేషం. కథ నచ్చటంతోనే మళ్లీ ఆయన చిత్రంలో నటించేందుకు అంగీకరించాడని, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని ధనుష్ సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి.
'రాంజానా' చిత్రం 21న హిందీలో, అదే రోజు 'అంబికాపతి' పేరిట తమిళంలోనూ తెరపైకి రానుంది. దీంతో పాటు భరత్బాలా దర్శకత్వంలో నటించిన నేరు తమిళచిత్రం 'మరియన్' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.