Don't Miss!
- Sports ధోనీ సార్ ధోనీ.. అంతే: సౌండ్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే..
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినిమా ఆగినా చరణ్ ని నీడలా వెంటాడుతున్న డైరెక్టర్...!?
రామ్ చరణ్ ఇమ్మీడియట్ గా నటించే సినిమా 'రచ్చ"అనే సంగతి తెలిసిందే. సంపత్ నంది దర్శకత్వం వహించే ఈ చిత్రం తర్వాత చరణ్ ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నాడు. వినాయక్ డైరెక్షన్ లో రూపొందే ఈ చిత్రానికి ఆకుల శివ కథ రెడీ చేశాడు, బద్రీనాథ్ షూటింగ్ పూర్తయిన తర్వాత వినాయక్ ఇక చరణ్ చిత్రం పనుల్లో నిమగ్నమవుతాడు.
ఇదిలావుంటే రామ్ చరణ్ చేద్దామనుకుని ఆపేసిన 'మెరుపు" పనులు ఇంకా ఆగలేదు. చరణ్ తో మెరుపు స్టార్ట్ చేసిన తమిళ దర్శకుడు ధరణి ఇప్పటికీ చరణ్ వెంటే ఉంటున్నాడు. మావీరన్ ఆడియో రిలీజ్ కి చరణ్ చెన్నయ్ వెళ్లినప్పుడు కూడా ధరణి అక్కడికి వచ్చాడు. అంతే కాక తమిళ చిత్ర సీమలోనూ అడుగు పెట్టాలని ఉందని చరణ్ అప్పుడే ప్రకటించాడు. త్వరలోనే ఒక పేరున్న తమిళ దర్శకుడితో స్ట్రెయిట్ తమిళ చిత్రంలో నటిస్తున్నట్టు చరణ్ పేర్కొన్నాడు. మెరుపు చిత్రాన్ని తెలుగు, తమిళంలో రూపొందించాలని అనుకుంటున్న చరణ్ ముందుగా 'మగధీర" అనువాదంతో తమిళనాట పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు. మావీరన్ కి అక్కడ అనుకూల స్పందన ఉంటే కనుక చరణ్ తమిళనాడుకి కూడా తన మార్కెట్ ని విస్తరించుకోవాలనుకుంటున్నాడు.