Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మణిరత్నం ముంచేసాడని పోలీస్ కంప్లైంట్
ఆ పిర్యాదులో ... ''రూ.16 కోట్లు వెచ్చించి కొంటే రూ.3.2 కోట్లు మాత్రమే వచ్చింది. కడల్ చిత్రాన్ని పంపిణీకి ముందు ఓసారి చూపించమని కోరితే సాంకేతిక కారణాల వల్ల కుదరదని మణిరత్నం మేనేజర్ తెలిపారు. దర్శకుడిపై నమ్మకంతో కొన్నాను. నష్టం గురించి ఆయనతో చర్చించాలని పలుమార్లు ప్రయత్నించాను. భేటీ కుదరలేదు. నష్టపోయిన మొత్తాన్ని ఇప్పించాలి''అని ఆ ఫిర్యాదులో మన్నన్ పేర్కొన్నారు.
మరో ప్రక్క దర్శకుడు మణిరత్నం ఇంటికి పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మణిరత్నం మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన కేసులో కడలి సినిమా ప్రస్తుతం రాష్ట్రంలోని పలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నాడు. ఈ సినిమా పంపిణీ చేయడంలో డిస్ట్రిబ్యూటర్లకు నష్టం ఏర్పడిందని కొందరు బెదిరిస్తున్నారని తెలిపాడు. దీనివలన తన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందన్నారు.
తనకు పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు. ఈ కేసుపై న్యాయమూర్తి రాజేశ్వరన్ విచారణ జరిపారు. పిటిషన్దారుడి తరఫున న్యాయవాది కుమార్ రాజారత్నం హాజరయ్యారు. మణిరత్నం ఇంటికి, ఆయన కార్యాలయానికి వెంటనే పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి మార్చి 14వ తేదీ వరకు మణిరత్నం ఇంటికి, కార్యాలయానికి భద్రత కల్పించాలని పోలీసు కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.