హీరోయిన్స్ ప్రెవైట్ యవ్వారం..ఇరుక్కున్నారు
చెన్నై: సరదా ఒక్కోసారి ఇరికించేలా చేస్తుంది. ఇప్పుడు నజ్రియా నజ్రిమ్, రంజనీ హరిదాస్ ల పరిస్దితి అలాగే ఉంది. ఈ హీరోయిన్స్ ఇద్దరూ...కోదండ్ లో ఓ ఏనుగుపై ఎక్కి స్వారీ చేసారు. ఆ రెండు ఏనుగులూ స్టేట్ పారెస్ట్ డిపార్టమెంట్ కు చెందినవి. సినిమాకు సంభంధం లేకుండా సరదాగా చేసిన ఈ ఎడ్వంచర్ వారిని ఇబ్బందుల్లో పడేసింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
వి.కె. వెంకటచలమ్ సెక్రటరీ...హెరిటేజ్ ఏనిమల్ టాస్క్ ఫోర్స్ త్రిచూర్ కు చెందిన అధికారి ఈ విషయమై కంప్లైంట్ చేసారు. ఈ విషమయై ఏనిమల్ వెల్ఫైర్ బోర్డ్ అధికారులు, ఛీఫ్ కన్వీనర్..ఫారెస్ట్ అండ్ డైరక్టర్ జనరల్ కూడా ఇరుక్కున్నారు.

డిసెంబర్ 4,2014లో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం...ఏనిమల్ వెల్ఫేర్ బోర్డ్ అనుమతి లేనిదే ఎవరూ వాటిపై స్వారీ చేయరాదు. ఫారెస్ట్ డిపార్టమెంట్ కు ఆ ఏనుగలపై ఓనర్ షిప్ సర్టిఫికేట్ లేనప్పటికీ, సెంట్రల్ ఏనిమల్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి ఫర్మిషన్ తెచ్చుకోవాల్సిందే అంటున్నారు.
అయితే ఈ హీరోయిన్స్ ఇద్దరూ ఈ విషయాలు తమకు తెలియదని, తెలిస్తే తాము ఏనుగులపై ఎందుకు రైడ్ చేస్తామని చెప్తున్నారు. అయితే తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని గవర్నమెంట్ అధికారులు అంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











