Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినిమా ఆగిపోలేదని క్లారిఫై చేసాడు
చెన్నై : గౌతంమీనన్ దర్శకత్వంలోని 'వినైతాండి వరువాయా' చిత్రం శింబుకు బిగ్గెస్ట్ హిట్ను అందించిన విషయం తెలిసిందే. యువతను అమితంగా ఆకట్టుకుందీ సినిమా. మళ్లీ శింబుతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు గౌతంమీనన్ ప్రకటించారు. 'సట్టెండ్రు మారుదు వానిలై' అని పేరుపెట్టారు కూడా. కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిగింది.
తర్వాత గ్యాప్ లభించడంతో మరో చిత్ర కథను సూర్యకు వినిపించారు గౌతం. సూర్యకు నచ్చకపోవడంతో.. ఆ కథ అజిత్ చెంతకు చేరింది. అజిత్ ఒప్పుకోవడంతో సినిమా షూటింగ్ను కూడా ఆరంభించేశారు గౌతం. దీంతో శింబు చిత్రం తాత్కాలికంగా ఆగింది. కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోయిందని ప్రస్తుతం కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి.
దీని గురించి శింబు మాట్లాడుతూ.. '' గౌతం మీనన్ దర్శకత్వంలోని చిత్రం డ్రాప్ కాలేదు. అజిత్ చిత్రం వేగంగా సాగుతున్నందువల్ల తాత్కాలికంగా ఆగింది. ఆ సినిమా ముగిశాక.. తమ సినిమా ప్రారంభమవుతుంది''అని పేర్కొన్నారు.