Just In
- 10 min ago
బ్లాక్లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
- 1 hr ago
షూటింగ్కు సిద్ధమైన మహేశ్ డైరెక్టర్: ఆ తరహా కథతో ప్రయోగం చేయబోతున్నాడు
- 1 hr ago
ఆ డబ్బులేవో నువ్వే ఇవ్వొచ్చు కదా?.. యాంకర్ సుమ పోస్ట్పై నెటిజన్ల కామెంట్స్
- 1 hr ago
గ్యాప్ తర్వాత అదరగొట్టేసిన అమలా పాల్: ఆమెను అలా చూసి ఆశ్చర్యపోవడం ఖాయమట
Don't Miss!
- Sports
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒకే బంతికి ఒకే బ్యాట్స్మన్ రెండు సార్లు రనౌట్! వీడియో
- News
ఎన్నికల వేళ కేంద్రం మరో తాయిలం -బోడో రీజియన్కు రూ.500 కోట్లు -అస్సాంలో అమిత్ షా ప్రకటన
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మణిరత్నం సినీ సెట్ గోదాములో అగ్నిప్రమాదం

బుధవారం మణిరత్నానికి చెందిన గోదాము నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకి చేరుకుని గంటపాటు శ్రమించి మంటల్ని అదుపుచేశారు. అప్పటికే సామగ్రి బూడిదైంది. నష్టం రూ.లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.
'కడలి' చిత్రంతో భారీ అపజయాన్ని చవి చూసిన దర్శకుడు మణిరత్నం మరో సినిమాకు సిద్ధం అయ్యాడు. ఇండో-పాక్ సంబంధాలు నేపథ్యంగా దర్శకుడు మణిరత్నం ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇంకా అధికారికంగా ప్రకటించక పోయినా...'లజ్జో' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రం కోసం తొలుత బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్తో సంప్రదింపులు జరిపిన మణిరత్నం....తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని ముగ్గురు కథానాయకులతో ఈ చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నట్లు చెన్నై టాక్. తన ద్వారా వెండితెరకు పరిచయమైన మాధవన్, అరవింద స్వామి, గౌతమ్ కార్తీక్లతో ఈ సినిమా చేయాలని భావిస్తున్నాడట.
ఇక ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో నిర్మితమవుతుంది. భారత్-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం అందరికీ తెలిసిందే. భారత్-పాకిస్తాన్ విడిపోయిన సందర్భాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని, దానికి కాస్త ప్రేమకథను కూడా జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. సంచలన చిత్రాలను తెరకెక్కించే మణిరత్నం కథకు ఇప్పుడు ఈ అంశమే ముడిసరకుగా మారినట్లు సమాచారం.