Just In
- 10 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్తో రచ్చ.. లైవ్కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్పై రోహిత్ వివరణ!!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నడిగర్ సంఘం కార్యాలయంలో అగ్నిప్రమాదం.. నాజర్, విశాల్ రియాక్షన్ ఏంటి?
తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం ఉన్న భవనంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కార్యలయానికి చెందిన ఫర్నీచర్, ఇతర సామాగ్రీతో పాటు కొన్ని విలువైన పత్రాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. సిబ్బంది ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ, అత్యంత ముఖ్యమైన స్టేషనరీ కాలిపోయినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, నడిగర్ సంఘానికి కొత్త భవనం కట్టించేందుకు అధ్యక్షుడు నాజర్, కార్యదర్శి విశాల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంత మంది సినీ ప్రముఖుల నుంచి విరాళాలు సైతం సేకరించారు. అలాగే, ఈ సంఘానికి ఉన్న ఆస్తుల వివరాలను కూడా తరచూ వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? నిజంగా ఇది ప్రమాదమేనా? లేకపోతే ఎవరైనా కావాలని ఇలా చేశారా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా, దక్షిణ భారత నటీనటుల సంఘంగా పిలువబడే నడిగర్ సంఘాన్ని 1952లో ఎంజీ రామచంద్రన్, ఎన్ఎస్ కృష్ణన్, కే సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. అప్పట్లో మన తెలుగు సినీ ఇండస్ట్రీ కూడా దీని పరిధిలోనే ఉండేది. కాలక్రమేనా మన పరిశ్రమ దాని నుంచి వేరైపోయింది. ఇక, నడిగర్ సంఘానికి పరిమిత కాలానికి ఎన్నికలు జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో నాజర్ ప్యానెల్ విజయం సాధించింది. సీనియర్ దర్శక నటుడు భాగ్యరాజా, ఐసరీ గణేష్ టీమ్ పోటీ పడటంతో ఎన్నికలు వేడిని పుట్టించాయి. ఈ ఎన్నికల్లో హీరో విశాల్ కీలక పాత్రను పోషించిన విషయం తెలిసిందే.