మళ్ళీ సమంతతో గౌతమ్ మీనన్ చిత్రం..డిటెల్స్

By Srikanya

'ఏ మాయ చేసావె" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సమంత, ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ తో మరో సారి కలిసి పనిచేయనుంది. సమంత, సమీరారెడ్డి, కార్తీక్, వీరా ప్రధాన పాత్రధారులుగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మనదేశం మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో అశోక్ వల్లభనేని ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను నిర్మాత తెలియజేస్తూ సమంత నాయికగా గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేసావె" చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషలలో ద్విభాషా చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. గౌతమ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పేరుని, పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.వేణుగోపాల్, నిర్మాత: అశోక్ వల్లభనేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X