Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
మళ్ళీ సమంతతో గౌతమ్ మీనన్ చిత్రం..డిటెల్స్
'ఏ మాయ చేసావె" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సమంత, ఆ చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ తో మరో సారి కలిసి పనిచేయనుంది. సమంత, సమీరారెడ్డి, కార్తీక్, వీరా ప్రధాన పాత్రధారులుగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మనదేశం మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో అశోక్ వల్లభనేని ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను నిర్మాత తెలియజేస్తూ సమంత నాయికగా గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన 'ఏ మాయ చేసావె" చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషలలో ద్విభాషా చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. గౌతమ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పేరుని, పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.వేణుగోపాల్, నిర్మాత: అశోక్ వల్లభనేని, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ.