బ్రేకప్ తర్వాత నయనతార-శింబు కలిసి చేసిన మూవీ (ట్రైలర్)
చెన్నై: మాజీ ప్రేమికులైన నయనతార, శింబు చాలా కాలం తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో తమ మధ్య సాగిన లవ్ ఎఫైర్ జ్ఞాపకాలను పూర్తిగా మరిచిపోయిన ఈ స్టార్స్.......స్నేహితులుగా కొత్త జీవితం మొదలు పెట్టారు. ప్రస్తుతం ఇద్దరూ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఐదు నమ్మ ఆలు' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలయింది.
ఇద్దరూ ఫాంలో ఉన్న స్టార్స్ కావడం....పైగా మాజీ లవర్స్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గతంలో ఇద్దరూ రియల్ లైఫ్ ప్రేమలో ఉన్నపుడు తెరపై రొమాన్స్ బాగా పండించేవారు. రెచ్చిపోయి హాట్ హాట్ సీన్లలో నటించే వారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు.
తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. స్లైడ్ షోలో ట్రైలర్...

శింబు, నయనతార
ఐదు నమ్మ ఆలు చిత్రంలో శింబు, నయనతార రొమాంటిక్ కౌగిలింత

శింబు అల్లరి
ఐదు నమ్మ ఆలు చిత్రంలో రొమాంటిక్ మూడ్లో ఉన్న శింబు ఇలా వంట రూమ్ లో అల్లరి చేస్తున్న దృశ్యం.

నయనతార
ఐదు నమ్మ ఆలు చిత్రంలో శింబు, నయనతార ఇలా సాంప్రదాయ దుస్తుల్లో....

లవ్లీ మూమెంట్...
ఐదు నమ్మ ఆలు చిత్రంలోని సీన్లలో ఓ లవ్లీ సీన్. రొమాంటిక్ ఎంటర్టెనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

కాఫీ టైం...
ఇలాంటి స్వీట్ మూమెంట్స్...ప్రతి ప్రేమ జంట జీవితంలోనూ ఉంటాయి.
ట్రైలర్...
ఐదు నమ్మ ఆలు ట్రైలర్. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది


Click it and Unblock the Notifications











