Just In
- 9 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 53 min ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 1 hr ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్కు నిదర్శనం
Don't Miss!
- News
యూపీలో ఆగని అత్యాచారాలు.. కాపాడాల్సిన పోలీసే కాటేశాడు.. మరో ఘటనలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘కబాలి’ నే టార్గెట్ , కలెక్షన్స్ లో దాటాలనే లక్ష్యం
చెన్నై: నిన్నటిదాకా బాహుబలి ని దాటాలని అందరు పెద్ద హీరోలు టార్గెట్ గా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమా చెన్నైలో సాధించిన కలెక్షన్లు దాటాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.
'కబాలి' సినిమా ప్రభంజనం అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మూడు వారాల్లో ఏకంగా రూ.11 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. చెన్నైలో ఈ చిత్రం హక్కులను జాజ్ సినిమా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సంస్థకు చెన్నై మంచి లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా జాజ్ సంస్థ తాజాగా విక్రం నటించిన 'ఇరుముగన్' సినిమా చెన్నై హక్కులను సొంతం చేసుకుంది. చెన్నైలోని 'కబాలి' కలెక్షన్ను మించేలా దీన్ని తీసుకెళ్లాలని జాజ్ సినిమా బృందం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన 'ఇరుముగన్'లో నయనతార, నిత్యామేనన్ హీరోయిన్స్ గా నటించారు. శిబుతమీన్స్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల సినిమా పాటలను విడుదల చేశారు. సెప్టెంబరు తొలి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం తెలుగులో 'ఇంకొకడు' పేరుతో విడుదల కానుంది. నయనతార, నిత్యామేనన్ కథానాయికలు. ఈ చిత్రంలో అఖిలన్, లవ్ అనే రెండు విభిన్న పాత్రల్లో విక్రమ్ కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన చిత్ర ట్రైలర్ను చూస్తే విక్రమ్ సినిమాపై అంచనాలను మరోసారి పెంచేసింది.
లవ్ పాత్రలో కనిపించిన విక్రమ్ను చూస్తే నటనలో ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందుంటానని నిరూపించేలా ఉంది. ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. సెప్టెంబర్లో 'ఇంకొకడు'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది