Don't Miss!
- Finance
Boeing: నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది మందిని రిక్రూట్ చేసుకోనున్న జెట్ లైనర్
- News
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
వినూత్నమైన సబ్జెక్టుతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న పా రంజిత్
రజనీకాంత్తో 'కబాలి', 'కాలా' లాంటి చిత్రాలు తీసిన తమిళ దర్శకడు పా రంజిత్ త్వరలో బాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడు. గిరిజన స్వాంతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
పా రంజిత్ బాలీవుడ్ ఎంట్రీని ఖరారు చేస్తూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రాన్ని నమా పిక్చర్స్ సంస్థ నిర్మించబోతోంది. ఈ సంస్థ గతంలో ఇషాన్ ఖట్టర్, మాళవిక మోహన్ నటించిన 'బియాండ్ ది క్లౌడ్స్' చిత్రాన్ని నిర్మించింది.

బిర్సా ముండా జీవితం ఆధారంగా తెరకెక్కబోయే ఈ చిత్రం ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉంది. నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక సైతం జరుగాల్సి ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
சாதிகளை துறந்து.... சித்தாந்தங்களை சுமந்து..!! நமது உரிமைகளுக்கான அம்புகளை எய்துவோம்.சகோதரரின் அடுத்த நகர்வு பழங்குடி புரட்சியாளன் #பிர்சாமுண்டாவின் வாழ்க்கை பதிவு! @beemji pic.twitter.com/3uGTdrwIEG
— PRO Kumaresan (@urkumaresanpro) November 14, 2018
మనకు అల్లూరి సీతారామరాజు ఎలాగో.... ఉత్తరాదిలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారిలో బిర్సా ముండా ఒకరు. జార్ఖండ్ ప్రాంతంలో 1980 కాలంలో ఆయన బ్రిటిష్ వారిపై పోరాటం చేసి చరిత్రకెక్కారు.
పా రంజిత్ రూపొందించిన 'కబాలి', 'కాలా' చిత్రాలు రికార్డు స్థాయి కలెక్షన్ సాధించింది. అతడి మేకింగ్ స్టైల్ సైతం సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా రజనీకాంత్ను తెరపై చూపించిన విధానం అభిమానులను ఎంతగానో మెప్పించింది.