Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కమల్ 'దృశ్యం' రీమేక్ లో పెద్ద తప్పు దొర్లింది
చెన్నై : తెలుగులో సూపర్ హిట్టైన 'దృశ్యం' చిత్రం తమిళంలో కమల్ హాసన్ హీరోగా 'పాపనాశం' పేరుతో రీమేక్ చేసి మొన్న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అక్కడ మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. అయితే చిత్రంలో ఓ పెద్ద బండ్లర్ దొర్లినట్లు చెప్పుకుంటున్నారు. అదేమిటంటే....
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
సినిమాలో కమల్ హాసన్... ఆగస్టు 3న ...అంజాన్ (తెలుగులో సికిందర్) చిత్రానికి తన పిల్లలను తీసుకు వెళ్ళతాడు. అయితే ...నిజానికి ...ఆగస్టు 15న అంజాన్ చిత్రం విడుదల అయ్యింది. అది గమనించకుండా...ఆగస్టు 3 అని చెప్పారు. అదే తేది మీద కథ నడుస్తూంటుంది. ఇలాంటి విషయాన్ని కమల్ ఎలా మర్చిపోయాడు అని తమిళ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు.
ఈ సినిమా షూటింగ్ను కేవలం 39 రోజుల్లోనే పూర్తి చేసినట్లు సమాచారం. కమల్ సహకారంతోనే త్వరగా షూటింగ్ పార్ట్ను పూర్తి చేయగలిగామని సినీ యూనిట్ తెలిపింది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘దృశ్యం' సినిమాని కమల్ హాసన్ తమిళంలో ‘పాపనాశం' పేరుతో రీమేక్ చేసారు. ఈ మూవీలో కమల్ హాసన్ కి జోడీగా అలనాటి నటి గౌతమి నటించింది.
‘దృశ్యం' సినిమా ఇప్పటికే తెలుగు, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. తమిళంలో కూడా మంచి విజయం సాధిస్తుంది. ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ జీతు జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు.