Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వీళ్లకి ఇకనైనా హిట్ వస్తుందా..?
జీవాకు 'వందాన్ వెండ్రాన్', 'నీదానే ఎన్ పొన్వసందం', కార్తీకి 'ఆల్ఇన్ఆల్ ఇళగురాజా', 'అలెక్స్ పాండియన్', 'శకుని' వరుస పరాజయాన్ని రుచిచూపాయి. ఈ నేపథ్యంలో మంచి హిట్ కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారి సినిమాలు యాధృచ్ఛికంగా ఒకేరోజున తెరపైకి రానున్నాయి.
కార్తీ తొలి సినిమాతో తిరుగులేని పేరు సంపాదించుకున్నారు. అందుకు పదిరెట్ల విజయాన్నిచ్చింది 'సిరుత్త్తె'. ఆయనను మాస్ హీరోగా మార్చడం మాత్రమే కాదు... ప్రత్యేక స్టార్డం కూడా తెచ్చిపెట్టింది. అంతేకాకుండా.. ఈ సినిమాలు తెలుగులోనూ విడుదలై భారీగా కాసుల వర్షం కురిపించాయి. టాలీవుడ్లోనూ ఇక్కడికి దీటుగా మార్కెట్ ఏర్పడింది కార్తీకి. ఈ మధ్య తెలుగులో కూడా ఎదురుగాలులు వీస్తున్నాయి.
పూర్వవైభవాన్ని సొంతం చేసుకునేందుకు వెంకట్ప్రభు వండిన 'బిరియాని'ని థియేటర్లలో ప్రేక్షకులకు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. యువన్ శంకర్రాజా సంగీతం సమకూర్చారు. ఇది ఆయనకు వందో సినిమా కావడం విశేషం. 'మంగాత్తా' తర్వాత వెంకట్ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావాలని తొలుత నిర్ణయించారు. అప్పటికే 'ఆల్ఇన్ఆల్ అళగురాజా' సిద్ధమవడంతో వాయిదా వేశారు. ఈ నెల 20వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉందీ చిత్రం. కార్తీకి జంటగా హన్సిక తొలిసారిగా ఆడిపాడింది.
'కో' తర్వాత జీవాకు సరైన హిట్ లేదనే చెప్పాలి. గౌతంమీనన్ దర్శకత్వంలోని 'నీదానే ఎన్ పొన్వసందం'పై కోటి ఆశలు పెంచుకున్నారు. కానీ నిరాశే ఎదురైంది. ఇదే వరుసలో 'ముగమూడి', 'వందాన్ వెండ్రాన్', 'రౌద్ధిరం', 'డేవిడ్' కూడా వరుసగా బాక్సాపీసు వద్ద బోల్తా పడటంతో జీవా డీలాపడ్డారు. 'ఎండ్రెండ్రుం పున్నగై' ఆ లోటును తీర్చుతుందనే నమ్మకంలో ఉన్నారకాయన. కెరీర్ ప్రారంభించి పదేళ్లయినా తొలిసారిగా త్రిషతో జతకడుతున్నాడీ హీరో.
హ్యారీస్ జయరాజ్ సంగీతం సమకూర్చుతున్నారు. 'వామనన్' ఫేం అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త మ్యూజికల్, ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలు సంక్రాంతికి రావాల్సి ఉన్నా.. అజిత్ నటించిన 'వీరం', విజయ్ హీరోగా 'జిల్లా' కూడా పండుగ బరిలో ఉండటంతో ముందుగానే రానున్నాయి.