Don't Miss!
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రజినీకాంత్కు భార్య లత ఘన స్వాగతం: ఇంటర్నెట్లో వైరల్ అవుతోన్న ఫొటో
పేరుకు కోలీవుడ్ హీరోనే అయినా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆరు పదుల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తున్న ఆయన.. తన అప్కమింగ్ మూవీ షూటింగ్ కోసం కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారు. అక్కడ షూటింగ్ జరుపుతోన్న సమయంలో గత శుక్రవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సహాయక సిబ్బంది ఆయనను నగరంలోని అపోలో ఆస్పత్రికి తలించారు. ఆ వెంటనే రజినీకాంత్ను పరీక్షించిన వైద్యులు ఆయన హైబీపీతో బాధ పడుతున్నట్లు నిర్ధారించి చికిత్స ప్రారంభించారు.
శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు హైబీపీకి చికిత్స తీసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆదివారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రి నుంచి డిచార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆ వెంటనే ఆయన హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. ఆదివారం తన నివాసానికి చేరుకున్న ఆయనకు భార్య లత ఘన స్వాగతం పలికారు. సూపర్ స్టార్ ఇంటికి వెళ్లగానే హారతి పల్లెంతో ఎదురు వచ్చిన ఆమె.. దిష్టి తీసిన అనంతరం ఆయనను లోపలికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా, రజినీకాంత్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న 'అన్నత్తై' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం చిత్ర యూనిట్లోని కొందరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వాళ్లను ఆస్పత్రికి తరలించి.. సినిమా షూటింగ్ను నిలిపివేశారు. అప్పటి నుంచి రజినీకాంత్ ఓ ఫైవ్ స్టార్ హోటల్లో స్వీయ నిర్భందంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. రజినీ ఆరోగ్య పరిస్థితిపై తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన స్టార్లు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.