సెన్సార్ ఇవ్వలేదని చంపేస్తామని బెదిరింపు
చెన్నై: తమిళ , మాజీ ఎమ్మల్యే, నటుడు ఎస్వీశేఖర్ ఇంటికి పోలీసు భద్రత కల్పించారు. నటుడు ఎస్వీ శేఖర్ ప్రస్తుతం సెన్సార్బోర్డు సభ్యుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో చోటుచేసుకున్న యుద్ధ నేపథ్యంలో 'పోర్కలత్తిల్ ఒరు పూ' పేరిట ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్కు వెళ్లింది.

అయితే కొన్ని కారణాలతో సినిమాకు ధ్రువపత్రాన్ని అందించడానికి నిరాకరించారు. ఈ నేపథ్యంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎస్వీ శేఖర్కు ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. ఆయన మైలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసు భద్రత కల్పించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు


Click it and Unblock the Notifications











