Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
విశాల్ కు 'కబాలి' నిర్మాత వార్నింగ్, క్షమాపణకై డిమాండ్
చెన్నై: హీరో విశాల్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. తమిళ సినీ నిర్మాతల మండలికి వ్యతిరేకంగా మాట్లాడి వారి కోపానికి గురి అయ్యారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో విశాల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు నిర్మాతలకు విశాల్ వైపు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేలా చేసాయి. ముఖ్యంగా కబాలి నిర్మాత కలైపులి ధాను..నిర్మాతల మండలి అధ్యక్ష్యుడిగా విశాల్ కు వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు తమిళనాట చర్చనీయాంసంగా మారింది.
విశాల్ తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ...నిర్మాతల మండలి కొన్ని బర్నింగ్ ఇష్యూలకు సరిగా స్పందించటం లేదని నిందారోపణలు చేసారు. పైరసీ వంటి విషయాలలో వారు సీరియస్ గా పరిష్కారం వెతకటం లేదని విమర్శించారు.
పైరసీ వల్ల కేవలం నిర్మాతలకు మాత్రమే నష్టం అనుకుంటే పొరపాటు, పైరసీ ప్రభావంతో సినిమా సరిగా ఆడకపోతే దాని ఎఫెక్ట్ నటీనటులపై,టెక్నీషియన్స్ పడుతుంది అన్నారు. అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ పైరసీ విషయమై చర్చలు జరిపి చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించాడు. నిర్మాతల రెవిన్యూ పెరగటానికి డిటిహెచ్ రైట్స్ రైట్స్ గురించి మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సినిమా రిలీజైన రెండు వారాల తర్వాత డీవిడి రిలీజ్ అయ్యేలా ఎగ్రిమెంట్స్ చేసుకోవాలని చెప్పాడు.
అంతేకాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి చర్చించకుండా కేవలం అంతా కూర్చుని,కబుర్లు చెప్పుకుంటూ, బోండాం,బజ్జీ తింటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించాడు. అలాగే కౌన్సిల్ లో జనం మారాలని, కొత్త నీరు రావాలని, అప్పుడే బాగుపడుతుందని ఘాటుగా కామెంట్స్ చేసాడు.
స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు..
నేను పోటీ చేస్తా
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు చైర్మన్ గా కబాలి నిర్మాత కలైపులి ధాను ఉన్నారు. జనవరి ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తాను అన్నారు.
వారంలోగా
చాలా మంది ప్రొడ్యూసర్ కౌన్సిల్ లోని నిర్మాతలు విశాల్..వారం లోగా క్షమాపణలు చెప్పాలని లేదా తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
సమస్య ఏంటి
క్షమాపణ చెప్పకపోతే విశాల్ తదుపరి చిత్రాలకు తమ నుంచే కాక డిస్ట్రిబ్యూటర్స్ వైపు నుంచి కూడా సపోర్ట్ ఉండదని హెచ్చరిస్తున్నారు
తెలుగు పరిశ్రమనుంచి
తెలుగు పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చాలా నిర్ణయాలు తీసుకుందని వాటిని అనుసరించాలని అంటున్నారు
తగ్గించుకోవాలి
హీరోలు తమ రెమ్యునేషన్స్ తగ్గించుకోవాలి, ముఖ్యంగా యాభై లక్షలు దాటిన వారు అంటున్నారు.
లెటర్ వచ్చాకే
తనకు నిర్మాతల మండలి నుంచి ఏ విధమైన లెటర్ ఇప్పటివరకూ అందలేదని, అది వచ్చాక తన పాయింటాఫ్ వ్యూ చెప్తా అన్నారు
ఇద్దరి మధ్యే
నిజానికి రీసెంట్ గా కబాలి నిర్మాతకు, విశాల్ కి మధ్య మాటల యుద్దం జరిగింది. దాని పరిణామమే ఇది అంటున్నారు.
నెగ్గితే
విశాల్ తాను చెప్పినట్లుగా నిర్మాతల మండిలికు పోటీ చేసి గెలిస్తే, అప్పుడు సినీ ఆర్టిస్టుల సంఘానికేకా, నిర్మాతల మండిలికు కూడా ప్రెసిడెంట్ అవుతాడు