Don't Miss!
- News హైదరాబాద్ సిటీలో వర్షం: అటు ఎండలు.. ఇటు వానలు
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
120 బంగారు నాణేలు పంచిన హీరో సూర్య..
హీరో సూర్య అభిమానులకు గుడ్ న్యూస్. ఆలస్యం అవుతూ వస్తున్న ఈ సౌత్ స్టార్ తమిళ చిత్రం 'ఎన్జికె' షూటింగ్ ముగిసింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ జనవరితో 11తో చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ప్రొస్టు ప్రొడక్షన్ దశలోకి ఎంటరైంది.
షూటింగ్ ముగిసిన సందర్భంగా సూర్య ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్లందరికీ బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చారు. యూనిట్ మొత్తం మీద 120 మంది టెక్నీషియన్లు ఈ గోల్డ్ కాయిన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది.
తన సినిమా పూర్తయిన తర్వాత టెక్నీషియన్లకు బంగారు నాణేలు పంచడం తమిళ ఇండస్ట్రీలో సెంటిమెంట్. కొందరు స్టార్ హీరోలు కోలీవుడ్లో ఈ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. గతంలో హీరో విజయ్ కూడా మెర్సల్ సమయంలో ఇదే విధంగా బంగారు నాణేలు పంచారు.
'ఎన్జికె' సినిమాను 2017 చివర్లో అనౌన్స్ చేశారు. 2018 జనవరిలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. పలు కారణాలతో షూటింగ్ ఆలస్యం చేస్తూ దర్శకుడు సెల్వరాఘవన్ ఎట్టకేలకు ఈ జనవరికి పూర్తి చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
సూర్య తన తర్వాతి చిత్రం కెవి ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్నారు. దీనికి 'కాప్పన్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో ఆయన మినిస్టర్ పర్సనల్ గార్డుగా కనిపించబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ సైతం విడుదలైంది.