Don't Miss!
- News హరీశ్.. రాజీనామా చేతిలో పెట్టుకో: మామ అల్లుళ్లపై రేవంత్ ఫైర్, వరంగల్కు కీలక హామీలు
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రజనీ వార్నింగ్ వర్కవుట్ అయ్యింది, లాభం రెట్టింపు
చెన్నై: రజనీకాంత్ వరస ఫెయిల్యూర్స్ లింగ, విక్రమ సింహా ప్రబావంతో ఈసారిచాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆయనే అన్ని విషయాలు సమన్వయం చేసుకున్నారు. అందులో భాగంగా బడ్జెట్ కంట్రోలు పెట్టి సక్సెస్ అయినట్లు సమాచారం.
గతంలో రజనీచిత్రం అంటే వంద కోట్లు పెట్టుబడి పెట్టేవారు. అయితే ఈ సారి చాలా స్ట్రిక్టుగా దాన్ని 70 కోట్లుకు కుదించినట్లు సమాచారం. దాంతో ఈ చిత్రం బిజినెస్ పరంగా ఇప్పుడు రెట్టింపు లాభాలు చూసిందని కోలీవుడ్ టాక్. కబాలి ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు అయినట్లు సమాచారం. దాంతో నిర్మాత పూర్తి ఆనందంగా ఉన్నారు.
లింగా వివాదాలు, విక్రమ్ సింహా వివాదాలతో విసుగెత్తిన రజనీ ఇలా నిర్ణయం తీసుకుని తనపై జూదం ఆడద్దని హెచ్చరించినట్లు సమాచారం. తక్కువ బిజినెస్ అయినా రేపు సినిమా అటూఇటూ అయితే పెద్దగా నష్టపోయేదమీ ఉండదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదట ఈ విషయమై నిర్మాత విభేధించినా తర్వాత లాభ,నష్టాలు, పెట్టుబడలను బేరీజులు వేసుకుని దానికి తగినట్లే బిజినెస్ చేసినట్లు చెప్తున్నారు. పి.ఎ రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ఓ డాన్ గా కనిపించనున్నారు. ఆయన సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా చేస్తోంది.