అఫీషియల్: 'రోబో' సీక్వెల్ టైటిల్ మార్చారు
చెన్నై: రజినీకాంత్, ఐశ్వర్య రాయ్ల కాంబినేషన్లో 2010లో వచ్చిన రోబో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రానుంది. ఈ సినిమాకి కూడా శంకరే దర్శకత్వం వహించనున్నారు.
ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ సీక్వెల్ చిత్రానికి టైటిల్ 'రోబో-2' అనే ప్రచారం జరుగుతోంది. అది కాదని దర్శకుడు శంకర్ ట్వీట్ తో తెలియచేసారు. ఆ టైటిల్ ఏంటో ఇక్కడ చూడండి.
ఇక ఈ చిత్రంలో రజినీకాంత్కి జంటగా అమీ జాక్సన్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో భాగంగా అమీ శరీరాకృతికి తగ్గట్టు ప్రత్యేక దుస్తులు కూడా డిజైన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న సౌత్ ఇండియన్ సూపర్స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మాఫియా దాన్గా చేస్తున్న కబాలి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. గతకొద్ది రోజులుగాఈసినిమా మలేసియా, బ్యాంకాక్ లలో కబాలి షూటింగ్ జరుగుతోంది. కానీ ఈ చెన్నై షెడ్యూల్ కోసం రజనీకాంత్ ఓ స్మాల్ బ్రేక్ తీసుకోనున్నారు.

3డి ఫార్మాట్లో తీయనున్న ఈసినిమాని ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్గా చేసి ఇంటర్నేషనల్గా రిలీజ్ చేయటానికి ప్లాన్చేశారు. సౌత్ నుంచిఇంటర్నేషనల్ వరకూ ఓ సినిమాని ఒకేటైటిల్తో ప్రమోట్ చేయటానికి శంకర్ ఈ సినిమా టైటిల్ని మార్చే ఆలోచనలో ఉన్నారు. అయితే తెలుగుకు మాత్రం రోబో 2.0 అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాసం ఉంది.


Click it and Unblock the Notifications











