Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
రామ్ చరణ్ - రజనీకాంత్ ‘రోబో’ తాకిడికి తట్టుకోలేక సోలోగా ఎటాక్ చేయ్యొచ్చు..
రామ్ చరణ్ నటించిన 'మగధీర" తెలుగు నాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ చిత్రం తమిళ అనువాద హక్కులను కలైపులి థాను సొంతం చేసుకున్నారు. 'మగధీర"లో సునీల్ చేసిన పాత్రను అక్కడ వడివేలుతో రీషూట్ చేశారు. కాగా..తన సినిమాలకు మాత్రమే మాటలు రాసే భాగ్యరాజా ఈ చిత్రానికి మాటలు అందించారు. వాలి పాటలు రాశారు. తమిళంలో ఈ చిత్రానికి 'మన్నాది మన్నన్" అనే టైటిల్ ఖరారు చేశారు.
త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే 'రోబో" విడుదల కూడా త్వరలోనే ఉన్నందున 'మన్నాది మన్నన్" విడుదలను వాయిదా వేస్తే, ఆ తర్వాత పోటీ లేకుండా సోలోగా తమిళనాడుని ఎటాక్ చెయ్యొచ్చని అల్లు శిరీష్ అంటున్నాడు. రోబో, మన్నాది మన్నన్ ఒకేసారి రిలీజ్ అయితే రోబోనే చూస్తారు కానీ ఈ సినిమాని చూడరు కదా. అందుకే రజనీకాంత్ తో పోటీపడటం ఇష్టం లేక అల్లు శిరీష్ 'మన్నాది మన్నన్"ని వాయిదా వేస్తే మంచిదంటున్నాడేమో..