Don't Miss!
- Sports CSK Playing XI: స్టార్ ప్లేయర్పై వేటు.. LSGతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఈ లేడీస్ వీక్ నెస్ ఏంటో...
'రోబో" తర్వాత రజనీకాంత్ ఎలాంటి సినిమా చేస్తాడనే విషయంపై నెలకొన్న సందేహాలని తొలగిస్తూ 'రాణా"చిత్రాన్ని చేస్తున్నట్టు రజనీ ప్రకటించాడు. శంకర్ తో వరుసగా రెండు సినిమాలు చేసి, ఇప్పట్లో దక్షిణాదిలో మరే సినిమా అందుకోలేని రికార్డుని 'రోబో"తో నెలకొల్పిన తర్వాత అంతకంటే గొప్ప విలువలున్న చిత్రం చేస్తాడని అభిమానులు ఊహించారు. కానీ కెఎస్ రవికుమార్ లాంటి మసాలా డైరెక్టర్ తో మిలి చిత్రాన్ని ప్రకటించి రజనీ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కి పోటీగా నిలిచే పాత్రలో బాలీవుడ్ నటి రేఖ నటించనుందని అంటున్నారు. 'నరసింహా" నీలాంబరి తరహా పాత్రలో ఇందులో విలన్ గా నటిస్తుందని చెబుతున్నారు. అయితే రజనీకాంత్ ఇమేజ్ ఇప్పుడు లేడీ విలన్స్ కి సవాళ్లు విసిరే లెవల్ దాటిపోయిందని, ఇక ఆయన ఈ లేడీస్ వీక్ నెస్ ని పక్కన పెట్టి స్ట్రాంగ్ విలన్ ని పెట్టుకుంటే బాగుంటుందని కోలీవుడ్ విశ్లేషకులు గొణుగుతున్నారు. రజనీకి విలన్ రజనీనే తప్ప మరొకరు ఉండలేరని 'రోబో" సినిమాతో శంకర్ చాటిచెప్పాక కూడా రజనీ ఆడ విలన్ తో సై అనడం విచిత్రంగానే ఉంది కదూ..