Just In
- 34 min ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 59 min ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
- 11 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 11 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
Don't Miss!
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- News
మొన్న అమెరికా.. నేడు రష్యా: ఒక్కడి కోసం లక్షలాదిమంది: దాడులు..ఘర్షణలు: ఏం జరుగుతోంది?
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Automobiles
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మిరపకాయ్ పోరికి తమిళ ప్రేక్షకుల నుండి భారీ స్పందన..!
రవితేజతో నటించిన 'మిరపకాయ్" చిత్రం తర్వాత తెలుగు తెరకు దూరమై తమిళ తెరకు దగ్గరైన బెంగాళీ భామ రిచా గంగోపాధ్యాయ. 'తమిళంలో నేను నటించిన తొలి చిత్రం 'మయక్కమ్ ఎన్న". ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. విడుదలైన ప్రతిచోట ఈ చిత్రానికి తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇందులో నా పాత్రకు అంతటా మంచి స్పందన లభిస్తోంది" అంటోంది రిచా గంగోపాధ్యాయ. ఆమె నటించిన తొలి తమిళ చిత్రం 'మయక్కమ్ ఎన్న". ధనుష్ హీరోగా నటించాడు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు.
ఇటీవల విడుదలైన ఈ చిత్రం ద్వారా రిచా గంగోపాధ్యాయ తమిళ తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో రిచా పోషించిన పాత్రకు తమిళ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో రిచా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ' ఈ చిత్రంలో యామినిగా నటించాను. ఈ పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో ఇకపై నటనకు అవకాశమున్న పాత్రల్లో నటించాలనుకుంటున్నాను అంటున్నారు రిచా.
కాగా ప్రస్తుతం దబాంగ్ రీమేక్ లో శింబుతో నటించిన 'ఓస్తీ" చిత్రంలోనూ నా పాత్రకు ప్రేక్షకులు మంచి మార్కులే వేస్తారు. ఇందులో నెడువల్లి అనే మధ్యతరగతి యువతిగా నటిస్తున్నాను. ఈ పాత్ర కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టి నటిగా నా కెరీర్ను మలుపు తిప్పుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఎందు కంటే ఈ చిత్రం నన్ను ఓ విభిన్నమైన నటిగా నిలబెడుతుంది కాబట్టి" అంటోంది రిచా గంగోపాధ్యాయ.
ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంతో మరోసారి టాలీవుడ్ లో రిచా గంగోపాధ్యాయ తన అదృష్టాన్ని పరీక్షంచుకోనున్న విషయం తెలిసిందే.