Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కళ్యాణ్ రామ్ సినిమాలో చేసాకే ఇలా అయిందని ఏడుస్తోంది
వరసగా చెల్లెలు పాత్రలు వస్తూండటంతో విసుగెత్తిపోతున్నానంటోంది శరణ్యా మోహన్.కళ్యాణ్ రామ్ చిత్రం కత్తిలో చెల్లిగా నటించిన ఆమెకు ఆ సినిమా ఆడకపోయినా అన్ని చెల్లి పాత్రలే రావటంతో అర్దం కాని పరిస్ధితి నెలకొంది.దాంతో ఇకపై చెల్లెలి పాత్రల్లో నటించేది లేదని తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు గట్టిగా చెబుతోందని తెలుస్తోంది.అంతేకాక హీరోయిన్లు రేవతి, శోభన అంటే తనకెంతో ఇష్టమని, వారి పోషించిన లాంటి పాత్రల్లో నటించాలనే కోరికను వెళ్ళబుచ్చుతోంది.
ఇక 'విలేజ్లో వినాయకుడు' చిత్రంలో కృష్ణుడు సరసన హీరోయిన్గా నటించిన శరణ్య ఆ తర్వాత నానీ సరసన 'బీమిలీ కబడ్డీ జట్టు'లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. అయితే కళ్యాణ్ రామ్కు చెల్లెలుగా ఆమె నటించిన 'కత్తి' చిత్రం అంతగా ఆడకపోవటంతో శరణ్య నిరాశకు గురైంది.అదే సమయంలో అటు తమిళంలో, ఇటు తెలుగులో చెల్లెలి పాత్రలు తనను వెదుక్కుంటూ వస్తుండటంతో ఆమె ఒకింత కంగారు పడుతోంది.ఇప్పుడు తమిళంలో విజయ్ చెల్లిగా వేలాయుదం చిత్రంలో చేస్తోంది.