Don't Miss!
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శివాజీ 3డి: రజనీతో శ్రియ టోక్యో టూర్
చెన్నై: ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2007 రజనీకాంత్, శ్రియ జంటగా రూపొందిన చిత్రం 'శివాజీ'. ఈ చిత్రాన్ని త్రీడీ పార్మాట్ లోకి మార్చి మళ్లీ రీ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవిఎం సంస్థ ప్రసాద్ ఇఎఫ్ఎక్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్నారు.
ఈ చిత్రం త్రీడి వెర్షన్ ప్రీమియర్ షోను సెప్టెంబర్ 15న జపాన్ రాజధాని టోక్యోలో ప్రదర్శిస్తున్నారు. రజనీకాంత్ కు జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రీమియర్ షో నిర్వహిస్తున్నారు. ఈ షోకు రజనీకాంత్, శ్రియ కలిసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన శ్రియ చిత్ర బృందంతో త్వరలో కలవనుంది.
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఎస్ఎస్ గుహన్ మాట్లాడుతూ- 'శివాజీ' చిత్రాన్ని 2డి నుండి భారీ ఖర్చుతో త్రీడీ ఫార్మేట్లోకి మార్చామని, ఈ సినిమా విజయవంతమైతే 'రోబో' 'నరసింహ' వంటి చిత్రాలను కూడా త్రీడీ లోకి మార్చే ఆలోచన ఉందనీ, రజనీకాంత్ చిత్రాలను ఇదే విధంగా చేయాలన్న కోరిక ఉందని తెలిపారు.
రజనీకాంత్ హావభావాలు, ఐశ్వర్యారాయ్ అందచందాలు వెండితెరకు త్రీడీలో చూసే అదృష్టం త్వరలో లభించనుందనీ, ఈ చిత్రాలను కూడా త్రీడీలోకి మార్చనున్నామని ఆయన వివరించారు. గత కొద్ది రోజులుగా ఆమె టొరంటొలో దీపా మెహత దర్శకత్వంలో వచ్చిన "మిడ్ నైట్ చిల్డ్రన్" చిత్ర ప్రిమియర్ ప్రదర్శన కోసం ఉన్నారు.