twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివాజీ 3డి: రజనీతో శ్రియ టోక్యో టూర్

    By Bojja Kumar
    |

    చెన్నై: ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2007 రజనీకాంత్, శ్రియ జంటగా రూపొందిన చిత్రం 'శివాజీ'. ఈ చిత్రాన్ని త్రీడీ పార్మాట్ లోకి మార్చి మళ్లీ రీ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవిఎం సంస్థ ప్రసాద్ ఇఎఫ్‌ఎక్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్నారు.

    ఈ చిత్రం త్రీడి వెర్షన్ ప్రీమియర్ షోను సెప్టెంబర్ 15న జపాన్ రాజధాని టోక్యోలో ప్రదర్శిస్తున్నారు. రజనీకాంత్ కు జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రీమియర్ షో నిర్వహిస్తున్నారు. ఈ షోకు రజనీకాంత్, శ్రియ కలిసి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన శ్రియ చిత్ర బృందంతో త్వరలో కలవనుంది.

    కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత ఎస్‌ఎస్ గుహన్ మాట్లాడుతూ- 'శివాజీ' చిత్రాన్ని 2డి నుండి భారీ ఖర్చుతో త్రీడీ ఫార్మేట్‌లోకి మార్చామని, ఈ సినిమా విజయవంతమైతే 'రోబో' 'నరసింహ' వంటి చిత్రాలను కూడా త్రీడీ లోకి మార్చే ఆలోచన ఉందనీ, రజనీకాంత్ చిత్రాలను ఇదే విధంగా చేయాలన్న కోరిక ఉందని తెలిపారు.

    రజనీకాంత్ హావభావాలు, ఐశ్వర్యారాయ్ అందచందాలు వెండితెరకు త్రీడీలో చూసే అదృష్టం త్వరలో లభించనుందనీ, ఈ చిత్రాలను కూడా త్రీడీలోకి మార్చనున్నామని ఆయన వివరించారు. గత కొద్ది రోజులుగా ఆమె టొరంటొలో దీపా మెహత దర్శకత్వంలో వచ్చిన "మిడ్ నైట్ చిల్డ్రన్" చిత్ర ప్రిమియర్ ప్రదర్శన కోసం ఉన్నారు.

    English summary
    Rajinikanth and Shriya are expected to attend the premiere of Shivaji (3D) in Tokyo. Directed by Shankar, the film was originally released in 2007 and it went on to become a massive blockbuster. Shivaji (3D) is going to be screened in Tokyo on September 15.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X