Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
త్రిషకు టెండర్ పెట్టిన శ్రియ..శ్రియకు చెక్ పెట్టిన జీవా..
ఒకళ్ల సినిమాని మరొకళ్లు కొట్టేయడం అప్పుడప్పుడు మన సినిమా రంగంలో జరుగుతూనే వుంటుంది. కారణాలు ఏమైనా మొదట్లో ఒకర్ని ఎంపిక చేసుకున్నాక...మరొకళ్లు ఆ స్థానంలోకి వస్తుంటారు. ఇప్పుడు త్రిష విషయంలో కూడా అలాగే జరిగింది. 'హీరో' అనే మలయాళ సినిమాలో ముందుగా త్రిషాని కథానాయికగా బుక్ చేశారు. అయితే, ఆమె స్థానంలో ఇప్పుడు శ్రియా వచ్చి చేరింది. త్రిషాకి డేట్స్ సమస్య రావడం వల్ల ఈ సినిమా చేయలేకపోయిందని అంటున్నారు. అయితే, పారితోషికం విషయంలో తేడా రావడం వల్లే త్రిషని డ్రాప్ చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక శ్రియాకి మలయాళంలో ఇది మూడో సినిమా. పృద్వీరాజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ నవంబర్లో మొదలవుతుంది.
కాగా 'రంగం" సినిమాతో తెలుగునాట మంచి పేరు తెచ్చుకున్న జీవా తమిళంలో అయితే వరుస విజయాలతోదూసుకుపోతున్నాడు. అతని సరసన రౌద్రం సినిమాలో నటించిన శ్రియ అటు తమిళం, ఇటు తెలుగు రెండిట్లోనూ ఇదే సినిమాతో తిరిగి సత్తా చాటుకోవాలని చూసింది అయితే ఫామ్ లో ఉన్న జీవా కూడా శ్రియకి ప్లాపే ఇచ్చాడు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజే ఫ్లాప్ టాక్ రావడంతో శ్రియ భోరుమంటోంది. తెలుగులోకి రౌద్రం పేరుతోనే అనువాదమైన ఈ చిత్రం ఇంకా ఇక్కడ విడుదల కాలేదు. దడ, కందిరీగ ఉన్నాయని ఈ చిత్రాన్ని కాస్త ఆలస్యంగా విడుదల చేద్దామనుకున్నారు. అయితే ఇప్పుడు తమిళంలో మంచి టాక్ లేకపోవడంతో తెలుగులో విడుదలయ్యే సూచనలు కనిపించడంలేదు.