Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శృతి హాసన్...హాలీవుడ్ చిత్రం డిటేల్స్
కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కి ఇంటర్నేషనల్ స్ధాయి ఆఫర్స్ వస్తున్నాయి. ఫిరోజ్ నడియవాల నిర్మించనున్న భారీ ప్రాజెక్టు జ్యూయిల్ ఆఫ్ ఇండియాలో ఓ కీలకమైన పాత్రకు ఆమెను ఎంపికచేసారు. ఈ చిత్రాన్ని హాలీవుడ్ దర్శకుడు రోబ్ చోహెన్ (ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫేమ్) డైరక్ట్ చేయనున్నారు. ఇక హాలీవుడ్ నటులు ఆల్ పచినో, రాబర్ట్ డి నీరో లను ఈ ప్రాజెక్టుకోసం అడుగుతున్నారు. అలాగే హిందీ నుంచి అమితాబ్, ఆయన కుమారుడు అబిషేక్ ను కూడా తీసుకునే అవకాశం ఉంది. కాస్టింగ్ ఇంకా ఫైనల్ కాలేదు.
దాదాపు మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందనున్నదని సమాచారం. 'కోహినూర్' వజ్రాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. కథ ప్రకారం ఓ కుర్రాడు లండన్లోని టవర్లో ఉన్న కోహినూర్ వజ్రం నిజమైనది కాదని భావిస్తాడు. ఆ వజ్రం ఇండియాలోనే ఎక్కడో ఉందనుకుని, దానికోసం అన్వేషణ సాగిస్తాడు. ఈ నేపద్యంలో ఎదురయ్యే సవాళ్ళు, సాహసాలు ఈ చిత్ర కథ ప్రధానాంశాలు. ఇక శృతి హాసన్...సిద్దార్ధ సరసన కోవలమూడి సూర్య ప్రకాశరావు రూపొందించే సోషియో పాంఠసీలో నటిస్తోంది. అలాగే తమిళంలో సూర్య సరనస మురగదాస్ దర్శకత్వంలోనూ చేస్తోంది.