Don't Miss!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- News ఏపీలో ఇప్పటివరకు భారీగా పట్టుబడిన నగదు, మద్యం, బంగారం.. అత్యధికంగా ఎక్కడంటే
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నా సినిమా ఆపాలనుకున్నారంటూ దిల్ రాజు హీరో కన్నీళ్లు
చెన్నై: తమిళ నటుడు శివ కార్తికేయన్, కార్తీ సురేష్ జంటగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'రెమో'. అక్టోబర్ 7 న ఈ సినిమాను తమి ళంలో రిలీజ్ చేసారు. తెలుగులో ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఇక ఈ చిత్రం ధాంక్స్ గివింగ్ మీట్ ని చెన్నైలోని ఓ పాపులర్ హోట్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సినిమా దర్శక,నిర్మాతలతో పాటు సాంతేకిత నిపుణులు, టీమ్ మొత్తం పాల్గొన్నారు. ఈ మీట్లో మాట్లాడుతూ శివ కార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు.
శివకార్తికేయన్ మాట్లాడుతూ...తన సినిమాను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నించారని, ఎవరు తన సినిమాను విడుదల కాకుండా చేయాలనుకున్నారో తెలుసని, తన పని తాను చేసుకుంటూంటే ఎందుకిలా చేస్తారని ప్రశ్నిస్తూ శివ కార్తికేయన్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఆర్.డీ.రాజా నిర్మించారు.
రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించారు. 24ఎఎం స్టూడియోస్ బేనర్లో ఆర్.డి రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళనాట దసరా కానుకగా గత వారమే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
శివకార్తికేయన్ ఓ గమ్మత్తైన స్త్రీ తరహా పాత్రలో కనిపించడంతో భారీ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబడుతోంది.ఈ నేపథ్యంలోనే నిన్న చెన్నైలో టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది.